Saturday 15 August 2020

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి


కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నా.. జనాల్లో ఇప్పటికీ భయం ఉండ్లేదు. మనకు కరోనా రాదు.. వచ్చినా
ఏమవుతుంది అనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది.
ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో..
మేం ఎండలో తిరుగుతాం మాకు రాదు అనీ, మేము నాన్ వెజ్ తింటాం మాకు రానేరాదు అని భ్రమ పడుతున్నారు. నిన్న ఒకడు చికెన్ తింటే కరోనా రాదు KTR చెప్పాడు అన్నాడు. ఆయన చెప్పింది చికెన్ తినడం వలన కరోనా రాదు అని.. వీడు తింటే రాదు అని అర్థం చేసుకున్నాడు.
కరోనాకు వీడు వాడు అనే తేడాలు ఏమీ ఉండవు. ఎవరైనా ఒక్కటే
కరోనా మన దేశంలో చాలా నెమ్మదిగా మొదలైంది.. 130కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా కట్టడిని చూసి ఆశ్చర్య పోయిన ప్రపంచం ముందు కొంత మంది నిర్లక్ష్యం మూలంగా తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకున్నాం.
కరోనా గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
ఒకసారి ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇక జీవితాంతం మన శరీరలోనే ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది.
కరోనా వచ్చిన కొందరిలో 3 నెలల తర్వాత యాంటీ బాడీలు నశిస్తున్నాయని కనుగొన్నారు.
ఊహాన్ లో జరుగుతున్న పరిశోధనల్లో కరోనా వచ్చి తగ్గిన వారిలో 90శాతం మందికి ఊపిరితిత్తులు సరిగా పని చేయడం లేదని తేలింది. ఇంకా కొందరికైతే వెంటిలేటర్ కూడా అవసరమౌతోందంటున్నారు.
కానీ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించట్లేదు.
కొందరి ఆరోగ్యాల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రాణాల్ని కూడా హరిస్తోంది
అలాంటి నష్టం మన కుటుంబంలోనే జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. సాసైటీలో పలుకుపడి
ఉన్న వ్యక్తులు సైతం కరోనాతో పోరాటంలో ఓడిపోతున్న వైనాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 
కరోనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే ముందే జాగ్రత్త పడండి
ఒక్క క్షణం నిర్లక్ష్యం చాలు మన జీవితాన్ని తలకిందులు చేయడానికి.. 
కుటుంబం రోడ్డున పడడానికి ....
కాబట్టి ఈ మూడు జాగ్రత్తలు పాటించండి
1. మాస్క్
2. సానిటైజర్
3. భౌతిక దూరం
ఇవే మీకు శ్రీరామరక్ష..

No comments:

Post a Comment