Friday 15 September 2017

స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళిలాంటిదే


మొన్న ఒక రోజు  సిటీకి వెళ్ళినప్పుడు  
ఆటోలో వెళ్తుంటే పెద్ద ఊరేగింపు
ఎదురుగా రావటంతో ఆటో పక్కకు ఆపాడు డ్రైవర్.
ముందు పెద్ద బ్యాండు మేళం ,ఆ వెనకే చప్పుడ్లు
కొంత మంది డాన్స్ లు చేస్తున్నారు,
ఇంకా ఓ 30,40 కార్ల వరుస
దాదాపు ఓ 50మందితో  పెళ్లి ఊరేగింపు అనుకున్నా,
కాని ఎక్కడో తేడా కొడుతోంది
దగ్గరికొచ్చాక చూద్దునుగదా అది శవయాత్ర.
ఆశ్చర్యం ఇంతపెద్దగానా  అంతిమయాత్ర .
బాగా డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తట.
దాదాపు ఓ 3  లక్షల పైనే  ఖర్చు ఉండొచ్చు.
ఆ మాత్రం లేకపోతె ఎలా? అన్నారు.
కాకపొతే నాదొక్క డౌటు చనిపోయిన రోజే
ఇంత ఖర్చు చేస్తే మిగతా 11 రోజులు
ఎంత ఖర్చు ఉంటుందో ..
అయినా డబ్బున్నోడి ఇంట
చావుకూడా పెళ్ళిలాంటిదే  

Friday 1 September 2017

అడుగడుగునా గణపతి


ఇప్పుడు మా వూళ్ళో ఏ చౌరాస్తా లో నిలబడి చూసినా
కనీసం ఒక అయిదు, ఆరు గణపతి మండపాలు
కనిపిస్తాయి. లౌడ్ స్పీకర్లలో పాటలు మొగుతూంటాయి.
అందరూ గణపతి ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్
ప్రవేశపెట్టాడు అనుకుంటారు,కాని అంతకుముందే ఉన్న
వీటికి స్వాతంత్రోద్యమ కాలంలో బాగా ప్రాచుర్యం కలిపించి
ప్రజలందరినీ సంఘటితం చేయటానికి వేదికగా వాడుకున్నాడు.
అప్పుడు ఊరికో గణపతిని ప్రతిష్టించి అందరూ అక్కడికే వచ్చేవారు.
కాని ఇప్పుడు ఒక్కో పార్టీకి, కమ్యునిటికి,గుడికి, బడికి, వాడకు
వేరు వేరుగా ప్రతిష్టించి ఎవరికివారే పూజలు చేసుకుంటున్నారు.
హిందువులకు భక్తి ఉన్నది.. కానీ శక్తిలేదు అని కొందరు
అంటుంటారు. అవును సంఘటిత శక్తి  లేదు అనిపిస్తుంది
ఇన్ని మండపాలు చూసినపుడు.
ఇందులో ఆర్భాటానికో, చందాలు దండుకోవటానికో కొన్ని
వెలిస్తే కొన్ని మాత్రం దీన్ని వేదికగా చేసుకొని ఎన్నో
హర్షించదగిన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాయి.

ఆర్య వైశ్య యువజన సంఘం వారు మాత్రం
ఎక్కువగా సామాజిక  కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తారు.
మొదటి రోజు మట్టి గణపతి ప్రతిమలు ఉచిత పంపిణీ నుండి మొదలుకొని
విద్యలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, వివిధ అంశాలపై
వ్యాసరచన పోటీలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకను చాటుతారు.
ఇప్పటివరకు మా ఊళ్ళో ఏ ఉత్సవాలకు
పెద్దగ గొడవలు జరిగిన దాఖాలాలు లేవు .
కాని ఈసారి పోలీసులు ఎక్కువగా నిబంధనలు విధించారు.
ఐతే ఇన్ని మండపాలు ఒక్కొక్కటిగా తగ్గి ఒక్కటే ఐతే ఎంతోసంతోషం
మా ఊరు ఊరంతా ఐకమత్యంగా ఉన్నారని , కానీ నెరవేరదు కదా .