Tuesday 18 July 2017

పిల్లలు జాగ్రత్త

 రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు పిల్లల్నిజాగ్రత్తగా  చూసుకోండి.
ఇద్దరు పిల్లలు ఒకటి రెండు బ్యాగులతో 
వెళ్ళేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు  ఇంకా జాగ్రత్త.
 పిల్లల చేయి వదలకండి, గడుగ్గాయి లాంటి పిల్లలతో 
ఇంకా ఇంకా  జాగ్రత్త. లేదంటే కడుపు కోత మిగులుతుంది.
కింది వీడియో చుడండి చిన్న పిల్లవాడి 
అనాలోచిత చర్య ప్రాణం తీసింది 

వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 
పొంచి వున్న ప్రమాదాలు చాలానే ఉంటాయి.
భారి వర్షాలు వరదలతో రోడ్లు జలమయం అవుతున్నపుడు 
పిల్లల్ని బడికి పంపకపోయినా పెద్ద నష్టం లేదు.
 వారి ప్రాణాలకంటే ఏదీ విలువైనది కాదు.
దీంట్లో  చూడండి అదృష్టం కొద్దీ

ప్రాణాలతో బయటపడ్డ పిల్లవాడిని.


తప్పనిసరై పిల్లల్ని ఒంటరిగా పంపేటప్పుడు
వెనకా ముందూ ఆలోచించి పంపించండి,జాగ్రత్తలు చెప్పి పంపించండి 
లేదంటే తీరని బాధ మిగులుతుంది.

Saturday 8 July 2017

ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా....




ఇక ఏడుకొండలకు ఉన్న మెట్లన్ని
ఎక్కి వెళ్లినా భక్తసులభుని దర్శనం
ఇక నుండి దుర్లభమే....

శ్రీనివాసా!
భక్తులు తిండిలేక గాని,
దేశాలు చూడాలని గాని నీ దగ్గరికి రారు.

వారి బలగాన్ని వసతులను వదలుకొని
కాలినడకన అలసి సొలసి వచ్చి నీ క్షణకాల దర్శనం కోసం
మళ్లీ పడిగాపులు పడటం ఏమిగతి స్వామి...
నీవు భక్తులను కాపాడే వాడవంటారే,
కాని నీ అక్రమాల కార్యాలయంలో లడ్డూలు,  వడలు వంటి
ప్రసాదాలనేకాక దర్శనానికి టకెట్లు అమ్ముతారా!!

ఏమి దుర్దశ ?
భక్తులకు నీ దర్శనం కూడ
ఉచితంగా అందించలేవా -

ఇక నుండి శుక్ర, శని ఆది వారాల్లో
కాలినడక భక్తులకు దివ్య దర్శనం
నిలిపి వేస్తూ TTD తీసుకున్న నిర్ణయం
శ్రీవారి భక్తులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సామాన్య భక్తులకు సేవలందిచాల్సిన TTD
డబ్బు చెల్లించేవారికి, VIP లకు దాసోహమంటోంది.
భగవంతుడి ముందు ఎవరైననూ సమానమేనని
ఎప్పటికి తెలుస్తుందో.
సామాన్యులూ భక్తులేనని ఎప్పటికి గుర్తిస్తుందో.

Tuesday 4 July 2017

వృద్ధాశ్రమాలు అవసరమా


చాల సంవత్సరాల క్రితం ఒకసారి
R P పట్నాయక్ గారిని ఒక వృద్దాశ్రమం ప్రారంభోత్సవానికి పిలిస్తే 
తన ప్రసంగంలో  ఆశ్రమం అట్టర్ ప్లాప్ కావాలని కోరుకున్నాడట. 
దాంతో పిలిచినవాళ్ళు ఖంగు తిన్నారట.
చాలామంది కూడా ఇదే కోరుకుంటారు.

ఎందుకంటే..


ఇవి మన భారతీయ సంస్కృతికి, జీవన  విధానానికి విరుద్ధమైనవి కాబట్టి. 
కాని మారిన పరిస్థితుల్లో ఇవి  అనివార్యం అవుతున్నాయి. 
ఉన్నత చదువులకై , ఉద్యో గాలకు  విదేశాలకు, దూరప్రాంతాలకు
వెళ్లినవారు తప్పనిసరై ఆశ్రమంలో ఉంచితే అర్థం ఉంది.
 వారికి తమ తల్లిదండ్రులపై ప్రేమ లేదనుకుంటే  అది పొరపాటే 
వారి పితృ భక్తిని శంకించాల్సిన అవసరం లేదేమో
కాని తల్లితండ్రులను సరిగ్గా చూసుకొకపొవడం, 
ఒకే ఊరి లొ ఉండి వృద్ధాశ్రమాలలొ పెట్టడం తప్పు. 
ఇటువంటి వారిని నిరుత్సాహపరిచి శిక్షించే  విధంగా
చట్టాలు వస్తే బాగుంటుంది. ఇప్పటికే కొన్ని కోర్టులు 
వేరుకాపురం గురించి తీర్పులివ్వడం మంచి పరిణామం.
కని  పెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం 
మంచిది కాదని కోర్టులు మందలించటం మన జీవన విధానంలో
అన్ని  బంధాలను ఏ విధంగా దూరం చేసుకుంటున్నామో 
గుర్తు చేస్తోంది.
మాతృ దేవో భవ పితృ దేవో భవ అన్న వేధ మంత్రాన్ని 
వల్లే వేసిన నోటితోనే బయటికెల్లిపోమ్మని ఎలా అనగలుగుతున్నారు.
కడుపు కట్టుకొని వారు సంపాదించిన ఆస్తులను మాత్రం అక్కున చేర్చుకొని 
అనాథలుగా వారిని వ్రుద్దశ్రమాల్లో చేర్చేముందు 
మీకూ అదే గతి అత్యంత వేగంగా వచ్చేస్తుందని గమనించండి 
మీక్కూడా చావుకు ముందు వచ్చే చివరి మజిలీఅదే కాగలదు.