Saturday 20 January 2018

భక్తి


TV సరిగా రాకపోవటంతో ట్యూనింగ్ మొదలుపెట్టా 
దాదాపు 300 చానల్స్  వస్తున్నా తెలుగువి మాత్రం ఓ 50 ఉండొచ్చు.
అందులో భక్తి ,దైవసంబధిత మతపరమైన విషయాలను బోధించే చానల్స్ కూడా చాలానే కనిపించాయి
ఒక్క తెలుగులోనే 10కి పైగా  కనిపించాయి.
ఇది ఒకందుకు మంచిదే అనిపించింది.
మతం మనుషులకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అంటే 
భక్తి భావం మనిషిలో విలువలను మాత్రం  పెంచుతుంది. 
అది ఏ మతమైనా కావచ్చు దైవాన్ని విశ్వసించే వాడు మొత్తం సమాజం మంచిని కోరుతారు.
అని నా నమ్మకం.
ఇక ఒక్క మానసిక ప్రశాంతత తప్ప అన్ని రకాలైన ఆధునిక సౌకర్యాలనూ 
మనిషి అత్యంత సులువుగా పొందుతున్నాడు. 
అందుకే ప్రశాంతత కోసం మనిషి దేవుడిని ఆశ్రయిస్తున్నాడు .
మనం గమనిస్తే ఇప్పుడు ఆలయాలను సందర్శించే వారిలో పెద్దవాళ్ళ కంటే  
యువతీ యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు .
మనిషి జీవితంలో కష్టాలు పెరిగినా కొద్దీ  దైవంపై భక్తి మరింతగా పెరుగుతుంది కదా.
ఈ నమ్మకం అతనికి కొంత మానసిక ప్రశాంతతను పాజిటివ్ థింకింగ్ను
ఇస్తుంది అంతే తప్ప వారికి గానీ సమాజానికి గానీ నష్టమేమీ లేదు.
ఐతే భక్తి, మత సంబధిత విషయాలలో, మత గురువులు, ప్రబోధకుల విషయాలలో
చానల్స్ కొంత విచక్షణతో వ్యవహరిస్తే బాగుంటుంది .
గురువులు, ప్రబోధకులను పిలిచి డిబేట్ లు పెట్టేటప్పుడు ఆయా విషయాలపై 
తమకు అవగాహన ఉన్నదా, చర్చించే తాహతు తమకుందా, తదుపరి పర్యవసానాలు 
ఏమిటీ అని ముందే చూసుకుని బేరీజు వేసుకుంటే  మంచిది. 
(ఇట్లా డిబేట్ లు పెట్టేఒక చానల్ గతంలో సర్వమత చానల్ అంటూ ఒక చానల్ను 
ప్రారంభించి తక్కువ సమయంలోనే మూసుకున్నది గుర్తుండే ఉంటుంది )
ప్రేక్షకులు కూడా తమ విచక్షణ తో అటువంటి చానల్స్ ను పక్కన పెడితే మంచిది.
ఏదేమైనా భక్తీ అనేది మనిషిలో ప్రశాంతతను, సాత్వికతను,భూత దయను 
కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Tuesday 16 January 2018

మ్యూజియంలో మన పండగలు


దేశంలోని వివిధ సాంప్రదాయక పండగలని, భిన్న ప్రాంతాల కళలను
 పరిచయం చేసేందుకు ఏర్పాటైన శిల్పారామంలో
ఇక్కడి  మన స్థానిక సాంప్రదాయ పండగలని కూడా
కొత్తగా ఎక్కడివో అన్నట్టు వింతగా  చూడవలిసి రావటం ..
అంటే ఆధునికత ముసుగులో మనం మన సంప్రదాయాల్ని, రుచులని ఎలా మరచిపోతున్నామో అద్దం పడుతోంది.

నిన్న ఒక మిత్రుడికి  శుభాకాంక్షలుచెబుతామని ఫోన్ చేస్తే
మాటల  మధ్యలో శిల్పారామం వెళ్లిందీ అక్కడ మన సంక్రాంతి హరిదాసులు,
గంగిరెద్దులవాళ్ళు, బుడబుక్కల వాళ్ళను చూసి పిల్లలు సంతోష పడ్డారని చెప్పాడు.
చిన్నప్పుడు చాల మంది ఇలాంటి వాళ్ళు పండగలకి మన ఊళ్లలో వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు
వస్తున్నారా అన్నాడు.
ఏం వస్తార్రా బాబు మొన్ననే  హైదరాబాద్లో గంగిరెద్దుల వాళ్ళని భిక్షగాల్లంటూ అరెస్ట్ చేసారట
కదా అన్నా, అవునురా అలా  అరెస్ట్ చేయడం ఎందుకు? మళ్ళా  వాళ్ళని శిల్పారామంలో ప్రదర్శనల కోసమని ఆంధ్రా నుండి పిలిపించటం ఎందుకు? అన్నాడు

ఇప్పటికే మన పండగల కంటే ఎక్కువ స్థాయిలో ఇంగ్లిషోడి పండగలే జరుపుకుంటున్నాం.
మన సాంప్రదాయ పిండి వంటలకంటే వాడి పిజ్జా బుర్గర్ లే మనకు నచ్చుతున్నాయి.
ఏమోరా! ఇలాగైతే మన పండగలని మన పిల్లలిక మ్యుజియంలోనే చూసుకోవాలి అన్నాడు.

పండగలు మనకు మన పూర్వీకులు ఇచ్చిన వరం.
దీంట్లో ఎన్నో ఆహార,  ఆరోగ్య, వ్యవహారిక సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
బెల్లం నువ్వుండలు, అరిసెలు, కొత్తబియ్యంతో చేసిన పిండి వంటలు
చలికాలంలో శరీరానికి వేడిని అందించి సంవత్సరమంతా
ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి .
ఇలా ప్రతి పండగకి వండే  ప్రసాదాలు ఆయా కాలాలకు అనుగుణంగా ఆరోగ్య సూత్రాలను
ఇముడ్చుకొని ఉంటాయి.
కాని గ్లోబలైజేషన్, మోడరన్ కల్చర్ ముసుగులో
మన సాంప్రదాయాలను ఫణంగా పెడుతున్నాం అనిపిస్తోంది
ఎంత అభివృద్ధి చెందిన మన మూలాల్ని మాత్రం మరవకూడదు.
అలా మరచిపోయిననాడు మ్యుజియంలే దిక్కు మనకు  .....