Thursday 3 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 4

మురుడేశ్వర్ నుండి బయలుదేరి
మేము బత్కల్ దగ్గర
భోజనం ముగించుకొని ఉడిపి
చేరేసరికి రాత్రి 11.00 అయింది.
దేవాలయం ఎదురుగా హోటల్ మధుర
లో రూం తీసుకున్నాం (600రూ)
బాగుంది. ఉదయాన్నే 6.00 గంటలకు
ఆలయానికి వెళ్ళాం. 7.00 గంటలకు
స్వామి వారి అలంకరణ కోసమని
క్యూలైన్ని లిపివేయడంతో పక్కనే
ఉన్నచంద్రమౌళీశ్వర ఆలయాన్ని,
దర్శించుకొని మళ్ళీ వరుసలో నిలబ
అరగంట లో ఆలయం లోకి
పెళ్లాం. అచంచల విశ్వాసం కలిగిన
భక్తుని కోసం
భగవంతుడు దిగివస్తాడనేందుక
ఈ ఆలయం నిదర్శనం.
నిమ్నజాతికులస్థడైన కనకదాసుకు
ఆలయ ప్రవేశం
అనుమతించకపోవడంతో అతని కోస
శ్రీకృష్ణ భగవానుడు
పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు
ఇక్కడి స్థల పురాణాలుచెప్తున్నాయి. ఆ
కారణంగానే ఇక్కడ దేశంలో ఎక్కడా లేని
విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ
దర్శనం ఉండదు. స్వామివారిని
కిటికీగుండా మాత్రమే
దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర
కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ
దేవాలయ సింహద్వారం
తూర్పుముఖంగా ఉన్నప్పటికీ
స్వామివారు మాత్రం
పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు.
ఎంత చూసినా తనివి తీరని స్వామి
వారి దివ్యమోహన రూపాన్ని మనసున
నిలుపుకొని ముందుకు కదిలాం .

No comments:

Post a Comment