Saturday 25 February 2017

పతనం వైపు పరుగు



ట్రంప్ వచ్చాక అమెరికాలో  ఇప్పటిదాకా ఏకంగా 1,000  కి పైగా
 జాతి వివక్ష దాడుల ఘటనలు  జరిగాయి .
అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే జరుగుతుండడంతో అటు
 భారతీయ విద్యార్థులు , ఇక్కడ తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .
 అసలే ఒళ్ళంతా జాత్యహంకారం కలిగివుండే తెల్లవాళ్ళను  ట్రంప్ వ్యాఖ్యలు బాగా
 రెచ్చగొడుతున్నాయి.  
'మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్ ను కాల్చి చంపుతూ
 దుండగుడు  గట్టిగా అరుస్తూ అన్న మాటలు చాలు,
వారి  నరనరాన జాతి వివక్ష ఎలా   జీర్ణించుకుపోయిందో  తెలుసుకోవడానికి .
అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదం తో ప్రచారం చేసిన ట్రంప్
 తన  చర్యలతో  అమెరికాను ఇప్పుడున్న స్థితి నుండి పతనం వైపు తీసుకెళ్ళకపోతే చాలు  అనేది చాలా మంది  అమెరికన్ల మాట .
చాలామంది వలసలకు అనుకూలంగా ఉన్నా కొంతమంది చర్యల వల్ల విదేశీయులు
 సహజంగానే  తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు .
ఐతే ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారంచేసే సంస్థలు ట్రంప్ గెలిచాక
 300 శాతానికి పెరిగాయి .
వీరి విద్వేషానికి అధ్యక్షుని మద్దతుకూడా ఉంది కదా !
తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని,
 కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా
ట్రంప్ అక్కడ ఉన్న విదేశీయులకు తానేమి రక్షణ  కల్పించాలనుకోవడం లేదని
 మా  దేశాన్ని విడిచి వెళ్ళడమే ఏకైక మార్గమని  చెప్పకనే చెప్పాడు .
ఈ సమయంలో భారతీయులు అమెరికాలో ఉండడం ఎంతవరకు శ్రేయస్కరం .
హెచ్‌1బి వీసాల విషయంలో తొందరపాటు చర్యలు సరికాదని అమెరికాను కోరకుండా
 ప్రధాని మోడీ  భారతీయులందరినీ
తిరిగి స్వదేశానికి రమ్మని కోరితే బాగుండేది.
ప్రపంచం మొత్తం ఒకవైపు అమెరికా ఒక్కటి ఒకవైపు అనే అభిప్రాయాన్ని కలిగిన
 అమెరికన్లు తమ పతనానికి తామే
బాటలు వేసుకుంటున్నారు  తెలివైన వాళ్లని కోల్పోవడం ద్వారా.

Thursday 23 February 2017

చిదానంద రూపం శివోహం శివోహం



ప్రతి సంవత్సరం మాఘ
బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి
అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం.
శివుడు ఈ రోజే
లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
క్షీరసాగర మధన సమయంలో వచ్చిన గరళాన్ని శివుడు తన గళాన నిలిపి
ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడిన
కాళరాత్రీ శివరాత్రేనట.
శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం
ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక,
శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని
పూజించే చేతులే చేతులు. శివుని సదా
స్మరించేవాడే ధన్యుడు.
'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని
ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు
సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.
సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ
శివమయమే. శివం కానిది 'శవ'మంటారు
జ్ఞానులు.
ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ
ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే
నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం.
మితృలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

Tuesday 21 February 2017

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభాష ....
మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ
ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష. 
మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా వాటిని
సవ్యంగా అర్ధం చేసుకోవాలంటే మాతృభాష సహకారంతోనే సాద్యం.
మన రెండు రాష్ట్రాల్లో ఎన్నో భాషలు
మాట్లాడేవారు ఉన్నప్పటికీ 90% మంది తెలుగు మాట్లాడేవారే.
కానీ ప్రజలు, పాలకులచే నిరాదరణకు గురై కుమరుగవబోతున్న భాష కూడా తెలుగే. 
ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు
మాధ్యమములోచదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా
తెలియ జెప్పుతున్నాయి.
తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అని
ఆకాశానికెత్తేశారు హాల్డెన్ అనే విదేశీ దొరగారు. ‘సుందర తెనుంగై’ అని
తెగ మెచ్చుకున్నారు తమిళకవి
సుబ్రహ్మణ్యభారతి. తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా
ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం
ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు అని నా అభిప్రాయం. 
ఏబీసీడీల వేడికి తెలుగు పలుకుబడి
మాడిమసయిపోకుండా పాలకులు చర్యలు తీసుకోవాలి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తెలుగును తప్పనిసరిగా మెదటి భాషగా చేసినప్పుడే తెలుగు మనుగడ సాధ్యం. అలాగైతేనే మన ప్రాచీనమైన భాష శాశ్వతంగా భూమిపై నిలిచి ఉంటుంది.

Saturday 18 February 2017

వాహన చోదకులారా జర భద్రం


ఎన్నో వాహనాలు వేగంగా వెళ్ళే రహదారుల ప్రక్క నివాసాలు ఉండే వారికి ఎందుకు
భయం ఉండదు. అన్నీ రోడ్లమీదే చేస్తుంటారు. అటూ ఇటూ చూడటం వంటివి
కూడా ఉండవు .
పిల్లలూ రోడ్లమీదే ఆడుకుంటారు. అంట్లు, స్నానాలు, అన్నీ అక్కడే
మద్యాన్నం కాలక్షేపం, రాత్రి నిద్ర అన్నీ రోడ్ల ప్రక్కనే
వాహనాల వాళ్ళే జాగ్రత్తలు పాటించాలి, రోడ్లప్రక్కన నివసించే ప్రజలు కాదు
అనేది రూల్ అని అనుకుంటారా
ఇవన్నీ ప్రక్కన పెట్టినా ఏదైనా ప్రమాదం జరిగినా అదీ వాళ్ళ
పొరపాటుగానే అయినా అక్కడ జరిగే సీన్ వర్ణించలేము.
పొరపాట్లు, పరిస్థితులు, ఏమీ ఉండవు. - ఏకపక్ష నిర్ణయం - బండి
వాడిదే తప్పు - వాడిని అర్జెంటుగా అడ్డంగా పట్టుకొని తన్నేసి ఆనక
తీరిగ్గా విచారించి డబ్బు అయితే డబ్బు, కేసయితే కేస్
కనుక వాహన చోదకులారా జర భద్రం :)
మీరే అక్కడ ఉంటె అందరిలా కాక కొద్దిగా ఆలోచించండి

Monday 6 February 2017

రైతు ప్రాణానికి విలువ లేదా?

కండ్లెదుటే తమకు
దక్కకుండా పోతున్న తమ సాగు భూమి ఒకవైపు...
30అడుగుల ఎత్తు న గాలిలో ప్రాణాలు మరోవైపు
తన
భూమికి పరిహారం చెల్లించిన
తర్వాతే పనులు కొనసాగించాలన్న ఇద్దరు అనంతపురం  రైతులను 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడ దీసిన కర్ణాటక అధికారులను చూస్తే... మనుషుల్లో జంతు ప్రవృత్తీ పూర్తిగా
సమసిపోలేదనిపిస్తుంది. రోజు రోజు కు
జంతు ప్రవృత్తి, ఆటవికం ఎక్కువవుతున్నాయని నా అభిప్రాయం

ధన్యవాదాలు

నేను బ్లాగు మొదలుపెట్టి నేటికి 100 రోజులు. ఈ 100 రోజుల్లో నా బ్లాగును వీక్షించింది 1600+ మంది. నాకే ఆశ్చర్యం గా ఉంది.
రాయాలన్న కోరికా తపనాఎన్నోరోజులుగా ఉన్నా , బ్లాగు ఎలా ప్రారంభించాలో తెలియక రాయలేదు .
ఎలా మొదలుపెట్టాలో తెలిసినతర్వాత
రాయడం ఎందుకు మొదలెట్టకూడదూ అనిపించి ఈ
చిన్న ప్రయత్నం చేసాను.
అందరూ మెచ్చుకోవాలన్న అత్యాశ లేదు, చదివితే
బాగుండును అన్నఆశ మాత్రం ఉంది !
గొప్పగా రాస్తానన్న ఆలోచన ఇప్పుడే కాదు ,
ఎప్పుడూ లేదు , తోచింది రాస్తాను అంతే ! నాలాంటి  రాసేవాల్లకు చదివేవాల్లే కదా బలం.

Sunday 5 February 2017

కాబోయే సూపర్ పవర్ భారతేనా?

అమెరికాలోని విదేశీయులను తరిమికొడతాం, మన ఉద్యోగాలు మనకే అన్న ట్రంప్ నినాదంతో సంబరపడి అధికారాన్నిచ్చిన అమెరికన్లకు వాస్తవ పరిస్థితులు అనుభవంలోకి రావడానికి ఎన్నోరోజులు పట్టలేదు. చాలాచోట్ల జరిగిన నిరసనలే దీనికి తార్కాణం.
ఒకవేళ అమెరికా లో ఉన్న భారతీయులందరినీ తిరిగి పంపితే... వాల్లంతా తిరిగి ఇండియాకే వస్తే..
మన ప్రధాని నినాదం మేక్ ఇన్ ఇండియా తోడైతే, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడడానికి ఎన్నో సంవత్సరాలు పట్టకపోవచ్చు.
అమెరికా అభివృద్ధి లో భారతీయులదే కీలకపాత్ర అనడంలో అనుమానమే లేదు. అదే భారతీయులు మాతృభూమి కోసం పనిచేయలేరా? భారతీయ ఉద్యోగుల పై ఆధారపడి పనిచేసే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు  ఇండియా ప్రధాన కేంద్రంగా  కార్యకలాపాలు  ప్రాంభించేలా ప్రోత్సాహిస్తే .. భారత్లో మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు ఉండవనే అపోహను తొలగిస్తే ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఇండియా బాట పట్టవచ్చు. ఇవే జరిగితే ఇండియా సూపర్ పవర్ కావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టకపోవచ్చు. (కానీ ఈ విషయం లో చైనా గట్టి పోటీదారు కావచ్చు)
అమెరికా భారతీయులెవరూ అవమానం తో తలదించుకొని రావలసిన అవసరం లేదు. నా మాతృభూమికి సేవ చేసే అవకాశం వచ్చిందని రాజీనామాలు చేసి గర్వంగా రండి. కంపెనీలన్నీ మీ వెనకే ఇండియాకి క్యూ కట్టకపోతే చూడండి.
ప్రపంచ పెద్దన్న పతనం  ఖాయం.

Saturday 4 February 2017

భయపడుతున్న భారతం

గత వారం రోజులుగా టివి, పేపర్లు పరిశీలిస్తే ఇండియా కి ఏదో అవుతోందనుకోవడం ఖాయం.
భారతదేశ జనాభా లో ఒక్క శాతం మాత్రమే అమెరికా లో నివసిస్తున్నారు.
అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిననాటి నుండి మీడియా లో రోజుకో కథనం.. విదేశీయులందర్ని వెనక్కి పంపిస్తారని.
విదేశీయుల్ని వెనక్కి పంపినా, రాకుండా అడ్డుకున్నా అమెరికా మనగలదా.
ప్రస్తుత అమెరికాలో ఇతర
దేశాల నుంచి వచ్చిన వారే 15 శాతం
మంది ఉన్నారు.
అమెరికాలో దాదాపు 25 శాతం చిన్న
వ్యాపారులు ఇతర దేశాల నుంచి
వచ్చిన వారే. వీరు బయటకు
వచ్చేస్తే.. అక్కడి పారిశ్రామిక రంగం
కుప్ప కూలిపోదా.
అమెరికాలో 25 శాతం కంపెనీలను వలస వచ్చినవారే స్థాపించారు. గూగుల్, ఈబే,
యాహూ, సన్ మైక్రోసిస్టమ్స్,
ఫేస్బుక్, ఇంటె ల్ కూడా వలసవాదులవే కదా..
ఈ కంపెనీలు లేకుంటే.. అమెరికా నంబర్ వన్ గా ఉంటుందా.
ఏ నాయకుడైనా తమవారే బాగుపడాలనుకోవడం సహజం ట్రంప్ కూడా అదే చేస్తాడు. వలస వచ్చే వారికి నిబంధనలు కఠినం చేస్తాడు కానీ పూర్తిగా వలసలను నిషేధించలేడు.
వలసవాదులే
లేకుంటే మేం ఈ 21వ
శతాబ్దంలో నం.1 అయ్యేవాళ్లమే
కాదు అని గతంలో ఒబామానే స్వయంగా అన్నారు.
స్వయంగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ కు ఇవన్నీతెలియదా..
తెలిసీ తమ సూపర్ పవర్ ను రిస్క్ లో పెడతాడా. 
మన టీవీ చానెల్ లు చెప్తున్న్ట్టట్టు ఏదో జరుగుతుందా.. 
కొన్నాళ్ళు ఆగితే కానీ అందరి అనుమానాలు తీరవు.