Saturday 15 April 2017

చల్లని చల్లని వేసవి కోసం

వేసవి ఎంత వేడిగా ఉంటుందో... ఆ వేడిలో చల్లదనం తగిలితే అంత హాయిగా ఉంటుంది.
 అందుకే, ఎండాకాలంలో చల్లగా  ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి,
ఈ సీజన్ లో లభించే ఏ పళ్ళను వదలకండి .అన్నిటిని తినండి.
పుచ్చకాయ, ఖర్బుజ, దోస, తాటి ముంజలు వంటివి ఒంట్లో చలువను కలిగిస్తే ,
 ఫలరాజం మామిడి ఎన్నో పోషకాలనిస్తుంది

పుచ్చకాయ లో  బీటా కెరోటి, విటమిన్ ఎ, బి1, బి6 మరియు విటమిన్ సి, పొటాషియం,
 మెగ్నీషియం, మ్యాంగనీస్, బయోటిన్, కాపర్లులు అధికగా ఉన్నాయి .
 ముఖ్యంగా వాటర్ దీని  లో వాటర్ కంటెంట్ 92శాతం ఉంటుంది.
 సమ్మర్ సీజన్లో వాటర్ మెలోన్ తినడం వల్ల రిఫ్రెష్ అవుతారు.


మామిడి పళ్ళు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది.
ఒకచిన్న  మామిడి పండులో 107 కేలరీల శక్తి
ఒక గ్రామ్ ప్రోటీన్,28 గ్రాముల కార్బోహైడ్రేట్లు,2.6 గ్రాముల పీచు పదార్ధం
3 మిల్లీగ్రాముల సోడియం,ఒక రోజుకు శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి లో 65 శాతం
విటమిన్ ఇ , విటమిన్  బి 6,శరీరానికి అవసరం అయ్యే ఫోలేట్ ఉంటాయి.



ఇక కర్బూజా  వేడి గాలులనుండి రక్షణనిస్తుంది , ఇందులోని  పొటాషియం
 రక్తపోటును అదుపులో ఉంచటం, మూత్రపిండాల్లో
 రాళ్లు తయారు కాకుండా ఆపటం లాంటివి చేస్తుంది.
 మలబద్ధకం సమస్యను తగ్గించటంలో ఖర్బూజా  బెస్ట్ .

ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా డీహైడ్రేషన్ అయిపోవడం సర్వసాధారణం.
ముంజలతోఈ సమస్య అధికమించవచ్చు
 ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్,
 పొటాషియం.. వంటివి పుష్కలం.

ఇక చల్లని వేసవి మీ సొంతం 

No comments:

Post a Comment