Monday 16 March 2020

కరోనా

కరోనా

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి
కరోనా.. పుట్టిన దేశంలో వేలాది మంది ప్రాణాలు తీసిన ఆ మహమ్మారి ఇప్పుడు దాదాపు140 దేశాలకు విస్తరించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1లక్షా 50వేల మంది ప్రాణాలను ప్రమాదం లో పడేసింది.
అయితే.. ఈ వైరస్ వ్యాప్తి వెనుక చైనా కుతంత్రం దాగిఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు కొందరు నిపుణులు. అమెరికా ట్రేడ్ వార్ తో తీవ్రంగా నష్టపోయిన చైనా నిజంగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు..
ఇజ్రాయెల్‌కు చెందిన బయోలాజికల్ వార్‌ఫేర్ ఎక్స్‌పర్ట్ డేనీ షోహామ్ అయితే చైనా బయో వార్‌కు దిగిందనే ఖరాఖండిగా చెప్తున్నారు.
ఆధారంగా... ఏ నగరం నుంచైతే కరోనా వ్యాప్తి చెందిందో ఆ చోటే చైనా బయో వెపన్స్‌ తయారు చేసే ప్రయోగశాల ఉందంటున్నారు.
(శత్రుదేశాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపరచి తద్వారా యుద్ధం చేయలేని స్థితిలోకి దిగజార్చడమే బయో వార్ లక్ష్యం)
ఐతే వూహాన్ నగరం లో ఉన్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి అనే లాబ్ WHO కు రెఫరెన్సు గా పనిచేస్తుంది కానీ చైనా తన స్వార్ధ ప్రయోజనాల కోసం దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.
ఎందుకంటే కరోనా వైరస్ ను అభివృద్ధి చేసింది ఇక్కడే , ప్రమాదవశాత్తు అది బయటికి వచ్చి ఇప్పుడు ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది.
కరోనా వచ్చిన వాళ్ళల్లో మరణాల రేటు ఒకటి రెండు శాతమే కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ సంఖ్యలెప్పుడు పూర్తి సమాచారాన్ని ఇవ్వవు
ఇంత పెద్ద మన దేశంలో కనీసం ఒక్క శాతం మందికి (కోటి మంది) సోకినా ఎంత ప్రమాదమో ఒక్కసారి ఊహించండి
ఉపేక్షించడం, తేలిగ్గా కొట్టిపారేయడం ప్రమాదకరం
చైనాలో కరోనాతో మొదటగా మరణించిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన 34 మందిని ప్రస్తుతం పర్యవేక్షణ లో ఉంచారు వాళ్లందరికీ సోకకపోయినా ఎంతమందికి అంటుకునే అవకాశం ఉందొ అర్థం చేసుకోవచ్చు
కరోనావైరస్ గురించి మరో కొత్త కోణం జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు
కోలుకున్న తరువాత కూడా
తిరిగి మళ్ళీ దాని బారిన పడే అవకాశం ఉంది.
అంటే
ఒక సారి శరీరంలోకి జొరబడిందంటే
ఇక ఎప్పటికీ మన ఒంట్లోనే ఉంటుంది.
ఇప్పటికే ఇటువంటి ఒక కేసును వాళ్ళు డీల్ చేస్తున్నారట
అంటే కరోనా బారిన పడకుండా ఉండడమే ఉత్తమ మార్గం
వాస్తవాల కంటే ఊహాగానాలు అధికంగా ప్రచారం అవుతున్న ప్రస్తుత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు

-కరోనా వైరస్‌ ఏ కారణం వల్లనైనా గాల్లో కలిస్తే రెండు గంటలపాటు సజీవంగా ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్త అవసరం. గాలిలోని తేమ, దుమ్ము, ధూళి కణాలతో  ప్రమాదకరమైన వైరస్‌ ఆయా వస్తువులపైకి చేరుతాయి.  వాటిని తాకిన వారికి వైరస్‌ చేరుతుంది. అలాగే బాధితుల చెయ్యి తగిలినా వ్యాధి సోకుతుంది. వీలైనంత వరకు చేతులకు గ్లౌజులు పెట్టుకోవడం ఉత్తమం.
- జనం ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లకూడదు. ముఖ్యంగా బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లకు దూరంగా ఉండాలి. బస్సు, ఆటో, ట్రక్కర్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- చేతితో కంటిని నలపడం, పుసులు తీయడం, చేతితో తుడవడం చేయకూడదు. దీనివల్ల చేతిలో వైరస్‌ కంటిలోకి చేరే ప్రమాదం ఉంది. అవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని కంటిని శుభ్రం చేసుకోవాలి.
- పరిచయస్తులు కలిస్తే మర్యాదపూర్వకంగా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం అలవాటు. ఆలింగనం కూడా చేసుకుంటాం. ప్రస్తుతం ఇవేవీ మంచిది కాదు. వీలైనంత వరకు తెలిసిన వారికి నమస్కారంతో సరిపెట్టాలి. విదేశీయులు, విదేశాలకు వెళ్లివచ్చిన వారితో మరీ అప్రమత్తంగా ఉండాలి.
-ముక్కు, చెవి, నోటిలో వేళ్లుపెట్టుకుని కెలకడం వంటివి చేయకూడదు.
- చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్‌ ధరించడం చాలా శ్రేయస్కరం. కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసేవారు వీటిని తప్పక ధరించాలి.
- కిల్లీ, జర్దా, పాన్‌పరాగ్‌ వంటి అలవాట్లు ఉన్నవారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు. ధూమపానం అలవాటు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో కాల్చకూడదు.

ఇలా వీలయినంతగా జాగ్రత్తలు తీసుకోవడం వలన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చు.