Tuesday 29 May 2018

మరణం తర్వాత మరెన్నో జీవితాలు

మరణాన్ని గెలవలనుకుంటున్నారా?
లేదు మరణం తర్వాత మళ్లీ
జీవించాలని ఆశిస్తున్నారా?
అయితే మీకున్నది ఒకే ఒక మార్గం
అదే
అవయవ దానం


మనిషి మరణానంతరం కళ్ళు, గుండె,
ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, 
జీర్ణ వ్యవస్థలోని ఫ్రాంకియాస్, 
చిన్న, పెద్ద ప్రేవులు, గుండె కవాటాలు, చర్మం,
ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నీ
అవయవ మార్పిడీకి దానం చేయవచ్చు. 


అలా సేకరించిన వాటితో మరణం అంచున ఉన్న 
8 నుండి 10 మందికి ప్రాణ దానం చేయచ్చు 
ఇంకా మరో 50 మందికి కావలసిన అవయవాలను అందించి 
వారి జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు.
బ్రతికి ఉన్న దాత కూడా అవయవ దానం చేయవచ్చు 
తన జీవితంలో ఒకవ్యక్తి 
ఒక మూత్రపిండంను, క్లోమం యొక్క భాగంను,
మరియు కాలేయం యొక్క కొంత భాగంను దానం చేయవచ్చు. 
కానీ బతికి ఉన్నపుడు కుటుంబ సభ్యులు, 
రక్త సంబంధీకులకు మాత్రమే అవయవ దానం చేయవచ్చు.


ప్రంపంచంలోనే అత్యధికంగా స్పెయిన్లో  10లక్షలకు 34మంది, 
అమెరికాలో 26మంది అవయవ దానం చేస్తుండగా 
మన దేశంలో మాత్రం 0.8 మంది మాత్రమే 
అవయవ దాతలుగా ఉన్నారు.
మనదేశంలో నిరక్షరాస్యత, పేదరికం 
అమాయకత్వం, మూఢ నమ్మకాల కారణంగా 
దీనిపట్ల అవగాహన చాలా తక్కువ. 
ప్రభుత్వం, మీడియాఈ దిశగా ప్రజలను చైతన్యపరిస్తే 
ఎక్కువ మందిని అవయవ దానం వైపు మళ్లించవచ్చు. 
ఇప్పుడిప్పుడే ఆదిశగా అడుగులు పడుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం మొదటి అవయవ మార్పిడి 
వినాయకుడికి జరిగింది. ఇక ఆధునిక వైద్య చరిత్రలో 1905 లో 
కార్నియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో మొదలైంది.

అవయవదానానికి 10 ఏళ్ళ వయసు నుండి 90 ఏళ్ళ
వయసు వారెవరైనా అర్హులే.
దేశవ్యాప్తంగా అవయవాల దానం
కోసం ఏటా 5 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 
వీరందరికోసం రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ కేసుల పైననే 
ఎక్కువగా ఆధార పడవలసి వస్తోంది. 
సాధారణ మరణాలప్పుడు కూడా 
అవయవ దానం జరిగితే  కొంత కొరత తీరినట్టే.
అవయవ దానం చేసినవారి కుటుంబాల్లో పిల్లలకు 
మోహన్ బాబు తమ విద్యాసంస్థల్లో 
5వ తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తానని
2015 లో ప్రకటించి తన సామాజిక బాధ్యత ను నిర్వర్తిస్తున్నారు. 
అలాగే ప్రతిఒక్కరు అవయవ దానాన్ని  ఒక బాధ్యతగా స్వీకరిస్తే 
ఏటా జరుగుతున్న 5లక్షల మరణాలలో కొన్నింటినైనా ఆపవచ్చు.



అవయవ దానం చేయాలనుకునే వారు ఈ క్రింది లంకె పై క్లిక్ చేయండి
 Link  👉 ( మరణం తర్వాత నాకు మరో జీవితం కావాలి  )