Saturday 8 July 2017

ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా....




ఇక ఏడుకొండలకు ఉన్న మెట్లన్ని
ఎక్కి వెళ్లినా భక్తసులభుని దర్శనం
ఇక నుండి దుర్లభమే....

శ్రీనివాసా!
భక్తులు తిండిలేక గాని,
దేశాలు చూడాలని గాని నీ దగ్గరికి రారు.

వారి బలగాన్ని వసతులను వదలుకొని
కాలినడకన అలసి సొలసి వచ్చి నీ క్షణకాల దర్శనం కోసం
మళ్లీ పడిగాపులు పడటం ఏమిగతి స్వామి...
నీవు భక్తులను కాపాడే వాడవంటారే,
కాని నీ అక్రమాల కార్యాలయంలో లడ్డూలు,  వడలు వంటి
ప్రసాదాలనేకాక దర్శనానికి టకెట్లు అమ్ముతారా!!

ఏమి దుర్దశ ?
భక్తులకు నీ దర్శనం కూడ
ఉచితంగా అందించలేవా -

ఇక నుండి శుక్ర, శని ఆది వారాల్లో
కాలినడక భక్తులకు దివ్య దర్శనం
నిలిపి వేస్తూ TTD తీసుకున్న నిర్ణయం
శ్రీవారి భక్తులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సామాన్య భక్తులకు సేవలందిచాల్సిన TTD
డబ్బు చెల్లించేవారికి, VIP లకు దాసోహమంటోంది.
భగవంతుడి ముందు ఎవరైననూ సమానమేనని
ఎప్పటికి తెలుస్తుందో.
సామాన్యులూ భక్తులేనని ఎప్పటికి గుర్తిస్తుందో.

No comments:

Post a Comment