Monday 25 February 2019

విషకౌగిలిలో దీర్ఘాయుష్షు


దీర్ఘాయుష్మాన్ భవ అని ఎవరైనా దీవిస్తే  భయమేస్తోంది!!
అయినా
30 ఏళ్లకే బీపీ 35 కు షుగరు
40 కి రాగానే గుండెపోటు 45 కి రాగానే ఏదో కాన్సర్  
లేదంటే పక్షవాతం.... ఇక వందేళ్లు బతకాలని ఎవడనుకుంటాడు
అన్నాడు మిత్రుడొకరు
ఔను! మన కంటే ఒకటి రెండు తరాల ముందు వాళ్ళు బాగానే ఉండే వాళ్ళు 
మరి మన కి ఏమైంది??
ఏముంది
1960-70 లో హరిత విప్లవంతో మొదలైన 
విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగుమందుల
వాడకం కాస్తా మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది
వ్యవసాయ భూముల్లో వరి,పత్తి, మిరప,
కూరగాయలు మరేఇతర వ్యవసాయ పంటలు వినియోగిస్తున్న
రసాయనాలు (అగ్రోకెమికల్స్) నేరుగా
చెరువుల్లోకి అక్కడినుండి బోర్లు, బావుల్లోకి ఇంకా నదుల్లోకి చేరుతున్నాయి.
దాంతోభూగర్భ జలాలు
కలుషితమవుతున్నాయి అలా కలుషితమైన
నీటినే వంటకు, తాగడానికి వాడుతున్నాం 
అదే ఈవ్యాధులకు ముఖ్య కారణమని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి 
అయినా ఇవి ఒక కొలిక్కి రావడంలేదు ఎందుకంటే ఇవి
పరస్పర ఆధారిత మరియు బహుళ విభాగ
పరిశోధనలతో ముడిపడి ఉంటాయి


అదీకాక మనం తినే ఆహారంలో 
పురుగుమందులు, రసాయనాల అవశేషాల స్ధాయి చాలా ఎక్కువట. 
ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసిన తర్వాత 
పంటలు (ఆకు కూరలు, కాయగూరలు) కోయటానికి 
కనీసం పది రోజులు ఆగాలి కానీ అలా జరగడం లేదు.
లేదంటే అలాంటి కూరల వల్ల నాడివ్యవస్థ, నరాల
వ్యవస్థ దెబ్బతింటుంది.. కాలేయం పనితీరు పాడయ్యే
అవకాశం ఉంటుంది. మూర్చ వచ్చే ఆవకాశం ఉంటుంది. రోగ నిరోధక
శక్తి తగ్గిపోయి చిన్నచిన్న వ్యాధులకు కూడా శరీరం
తట్టుకోదు. తరచూ జలుబు, తలనొప్పి వస్తుంది. నీరసంగా ఉంటుంది.
కొన్ని మందుల వల్ల క్యాన్సర్ వంటివి కూడా సోకే ప్రమాదం కూడా ఉంది.
వాహనకాలుష్యంతో  వెలువడే పొగలో ఉండే సీసం, మరికొన్ని రసాయనాల వల్ల క్షయ, మెదడు సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి 



ఇక రెస్టారెంట్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే అజినమోటో, వెనిగర్, ఫుడ్ కలర్స్ లాంటివే కాక నిలువ ఉంచేందుకు వాడే రసాయనాలు ఎన్నో ...
మరో విషయం కూడా పరిగణనలోకి
తీసుకోవాలి. చిన్న చిన్న జలుబు,దగ్గు,జ్వరం లాంటి జబ్బులకు,
చీటికీ మాటికి ఆర్.ఎం.పి.ల ప్రెస్క్రిప్షన్ తో మందుల గోళీలు
వాడటం కూడా ఆరోగ్యం దెబ్బతినటానికి ఓ కారణం . 
క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో వాడాల్సిన కొన్ని మందుల్ని  RMP లు అతి సాధారణంగా వాడేస్తున్నారట. దాంతో అత్యవసర పరిస్థితుల్లో ఆయా మందులకు జబ్బులు లొంగటం లేదు అనేది కొన్ని పెద్ద ఆసుపత్రుల ఫిర్యాదు..
చీటికీ మాటకి మందులు మింగకుండా,
రసాయనాలతో కూడిన ఆహారాన్ని త్యజించి సేంద్రీయ ఆహారం తీసుకునే దిశగా ప్రయత్నిస్తూ అందరూ కాస్త అవగాహన పెంచుకుంటే వందేళ్లు బతికినా బాధ ఏమీ ఉండదు..
ఎవరికీ భారమవ్వరు..

                                          దీర్ఘాయుష్మాన్ భవ

2 comments: