Tuesday 5 December 2017

మళ్ళీ సైకిల్ కాలం


నా చిన్నప్పుడు సైకిల్ ఎవరో ఒక్కరికో గాని ఉండేది కాదు,
కానీ అందరికీ అవసరం ఉండేది.
దాంతో అందరూ సైకిళ్ళు కిరాయికి ఇచ్చే షాపులపై ఆధారపడే వాళ్ళు .
ఎవరో ఒకరు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకెళ్తే సైకిల్ ఇచ్చేవాళ్ళు.
ఒక గంటకు 25 పైసలు కిరాయి ఉండేది, 
క్యారల్ఉండేదైన, చిన్న సైకిల్కైనా 50 పైసలుకిరాయి  ఉండేది. 
దాంతో కొంతమందికి జీవనోపాధి లభించగా సైకిల్ లేనివాళ్ళకు అవసరం, మోజు తీరేది.
మా కుటుంబానికి మాత్రం నాలుగు సైకిళ్ళు ఉండేవి.
దాంతో నాకు కూడా చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. 
సైకిల్ ఎత్తుగా ఉండడం వల్ల సీటు మీద కూర్చుంటే కాళ్లు అందక పోయేవి. 
అందుకని సైకిల్ మధ్యలో కాలు పెట్టి తొక్కేవాళ్లం. 
దాన్ని ‘కాంచీ’ అనేవాళ్లం. 
కాల క్రమంలో బైకులు, స్కూటర్లు, వాటికి ఫైనాన్స్ ఇచ్చే సంస్థలు వెలిశాక
దాదాపు సైకిళ్ళు తొక్కే వాళ్ళు తగ్గి పోయారు.
ఇంకా సైకిల్లకంటే బైకులే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.
కాని  మళ్ళీ ఇప్పుడు అలాగే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలలో
సైకిళ్ళు కిరాయికి ఇచ్చే సంస్థలు వెలిశాయి.
ఇప్పుడు మాత్రం కాలుష్యాన్ని తగ్గించడం , ఆరోగ్యాన్ని పెంచుకోవటం
అనే లక్ష్యంగా వెలిశాయి.
కాని వీటిని కిరాయికి తీసుకోవాలంటే అందరికి సాధ్యం కాదు.
వాళ్ళ సంస్థలో సభ్యత్వం ఉండితీరాలి.
గంటకో పది రూపాయల కిరాయి ఉంటుందట.
చోరిలను నివారించటానికి  సైకిల్ GPS తో అనుసంధానించబడి ఉంటుందట.
పైగా వెనుకటిలాగా సైకిల్ తీసుకొని పోయిన చోటనే తిరిగి ఇవ్వాల్సిన అవరసం లేదు
దగ్గరలో ఉండే వారి ఇంకో స్టేషన్లో ఇవ్వొచ్చట.
మొత్తానికి కొన్ని ట్రాఫిక్ కష్టాలు తీరటం తో పాటు కాస్త ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చన్నమాట.

No comments:

Post a Comment