Showing posts with label యాత్ర. Show all posts
Showing posts with label యాత్ర. Show all posts

Tuesday, 7 December 2021

తిరుమలలో ఉచిత సదుపాయాలు


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకునే వాళ్ళు, అలా దర్శించుకునే కుటుంబాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో.. ఇంకా సంవత్సరం లోపే ఎన్నో సార్లు దర్శించుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు.
ఉచితంగా తిరుమలకు అనగానే ఆశ్చర్యపోకండి. మన ఊరినుండి తిరుపతికి వెళ్ళడం ఉచితం కాకపోవచ్చు కానీ ఒక్కసారి తిరుపతిలో అడుగుపెట్టిన క్షణం నుండి మీరు మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యే వరకు చాలా సేవలు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి భక్తులకు ఆర్థిక భారం తగ్గించేలా టీటీడీ ఎన్నో సేవలను ఉచితంగానూ లేదా నామమాత్రపు రుసుముతో అందుబాటులోకి తెచ్చింది. అందులో ముఖ్యమైనవి దర్శనం, భోజనం, వసతి.
తిరుపతిలో రైలు లేదా బస్సు దిగగానే మనకు మొదట కావల్సింది వసతి. దానికోసం రైల్వేస్టేషన్ పక్కనే విష్ణు నివాసంలో గానీ, లేదా బాస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీనివాసం వసతి సముదాయాల్లో ఉచిత లాకర్ సదుపాయం, పెద్ద పెద్ద డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. నామ మాత్రపు రుసుముతో రూములు కూడా లభిస్తాయి.


భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలవరకు చేరుకునేందుకు ధర్మరథం పేరుతో ప్రతీ రెండు నిమిషాలకు ఒక బస్సు విష్ణు నివాసం నుండి బయల్దేరుతుంది. మన లగేజిని అక్కడే ఇస్తే ఉచితంగా తిరుమలకు చేరుస్తారు. 

కాలిబాటలో కొండ ఎక్కే భక్తులకు మధ్యలో ఉచిత దర్శనానికి టోకెన్, ఉచిత లడ్డూ కూపన్ ఇస్తారు. అదనపు లడ్డూలకు కూడా అక్కడే డబ్బు చెల్లించి కూపన్లు పొందవచ్చు. మెట్ల మార్గం గుండా పైకి చేరుకున్న భక్తులు బస్టాండ్ ఎదురుగా ఉన్న CRO ఆఫీస్ వద్ద ఉచిత గదులు పొందవచ్చు. ఒక్కరికి గది ఇవ్వరు కనీసం ఇద్దరు ఉండాలి.

వృద్ధులు, చంటిపిల్లల తల్లులకు కూడా ఉచితంగా ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.
(ప్రస్తుతం కోవిడ్ వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు)

తిరుమలలో నాలుగైదు చోట్ల అన్నప్రసాద కేంద్రాల్లో ఉచిత భోజన వితరణ ఉదయం 8 గంటల నుండే మొదలవుతుంది.

తిరుమల లోని అశ్విని ఆసుపత్రితోపాటు అపోలో ఆసుపత్రిలో వైద్యం ఉచితం .
ఇక ఘాట్ రోడ్డులో వాహనాలు చెడిపోయినా, ప్రమాదానికి గురైనా రిపేర్లు, భక్తులను గమ్యం చేర్చడం ఉచితంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది.
ఇవేకాక మరికొన్ని సేవలను కూడా టీటీడీ ఉచితంగా అందిస్తోంది. 

Tuesday, 12 November 2019

హైదరాబాద్ టూ మేడారం

ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం
ఈసారి 2020 ఫిబ్రవరి5 నుండి  8 వరకు జరగనుంది.
5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనున్నారు.
ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దెకు చేరుకోనుంది.
ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు,
ఇక 8న అమ్మవార్ల వనప్రవేశం.
జాతర గురించి ఇక్కడ తెలుసుకోండి .  
 కొన్నేళ్ల కింద జాతర ఎలా ఉండేదో ఇక్కడ చదవండి 


మేడారం చుట్టూ, వెళ్లే దారిలో నూ ఎన్నో,మరెన్నో
చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి. 
ఆలయ దర్శనం అనగానే  రాయలసీమ, గోదావరి జిల్లాలవైపు
దృష్టి మల్లే మనకు మన తెలంగాణ లొనే మనకు తెలియని ఎన్నో ఆలయాలు
పురాతన కాలం నుండి ఎన్నో రాజవంశాల పాలనలో సంరక్షించబడి మనకందించబడ్డాయనేది
పెద్దగా తెలియకపోవడం మన  దురదృష్టం.
తగినంత ప్రచారం లేకపోవడం లేదా కొన్ని చిన్నచిన్ని గ్రామాలలో,
మారుమూల ప్రాంతాలలో ఉండటం వలన వీటికి రావలసిన గుర్తింపు, దక్కవలసిన గౌరవం
దక్కలేదని భావించవలసి వస్తుంది.
ఇంకా కొన్ని వందల సంవత్సరాల పాటు మహమ్మదీయుల పాలనలో
తీవ్ర నిర్లక్ష్యానికి గురవడం కూడా ఒక కారణం.
అయితే చాలా చోట్ల ప్రజలు సంస్కృతి సాంప్రదాయాల, భాష మరియు
ఆరాధనా విధానాల పట్ల ప్రేమతో వాటి అభివృద్ధికి విశేష కృషిచేస్తుండడం అభినందనీయం.
ఈసారి మేడారం
జాతరకు వెళ్లే ముందు కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే
 జాతరతోపాటు   ఆలాంటి కొన్ని ప్రదేశాలు చూసే అవకాశం ఉంటుంది.
వీలైతే ఈవిధంగా ప్లాన్ చేసుకోండి.

హైదరాబాద్ నుండి బయల్దేరితే మొదట వచ్చేది
చారిత్రక ప్రదేశం అయిన భువనగిరి కోట
అక్కడినుంచి యాదాద్రి దగ్గరే.
ఇక ఆలేరు కు రాగానే ఎడమవైపు వెళ్తే
6 కిమి దూరం లో 2000 సంవత్సరాల నాటి  జైన క్షేత్రం కొలనుపాక,
కుడివైపు వెళ్తే పురాణపురుషుడు  శ్రీరాముడు
మాయాలేడి ని  చంపిన ప్రదేశం జీడీకల్ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
ఇవి అన్నీ  చూడడానికి ఒకరోజు పడుతుంది.

ఇక అక్కడి నుండి తర్వాతి మజిలీగా వరంగల్ చేరుకోవచ్చు.
ఒకప్పటి కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లే నేటి వరంగల్.
తెలంగాణా రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం.
ఇక్కడ సాధారణమైన వాటినుంచి స్టార్ హోటల్ల వరకు
అన్నీ ఉన్నాయి కాబట్టి వసతి కి కొదవ లేదు. మిగతా తర్వాతి పోస్ట్ లో........

Friday, 15 February 2019

రెండు రోజుల్లో పంచారామాలు ...

బిజీ బిజీ జీవితంలో కాస్త విశ్రాంతి కోసం అలా ఓ రెండ్రోజుల 
ఏదైనా విహారాయాత్రకు వెల్దామని నిర్ణయించుకున్నదే తడవుగా  
మా మిత్రులందరూ మేము సైతం అంటూ ok చెప్పారు
మరి ఎటు వెళదాం??
విహారయాత్రకు.....
ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు..
ముక్కోటి దేవతలు కొలువైన ఆలయాలు..
ఆకుపచ్చని అరణ్యాలు..
ఆకాశం నుండి దూకే జలపాతాలు..
ఎన్నో ఉన్నా ఈసారి ప్రకృతి రమణీయతకు, 
అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రాలకూ 
నెలవుగా ఉన్న గోదావరి జిల్లాలోని
పంచారామ క్షేత్రాలను చుట్టి రావాలనుకున్నాం
సమయం అనుకూలిస్తే మధ్య మధ్యలో ఉండే 
ఇతర క్షేత్రాలను చూడాలనుకుంటున్నాం
వెళ్తున్నామనగానే ఎక్కడ ప్రారంభించాలి, ఎలా వెళ్ళాలి, 
ఎక్కడ బస చేయాలి, ఎక్కడముగించాలి అని కొందరు మిత్రులు  
వారి అమూల్యమైన సలహాలు,సూచనలు  తెలియజేసారు 
వారందరికీ  ధన్యవాదాలు. 
 రెండు రోజుల్లో చుట్టి రావడానికి ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటె 
కామెంట్ చేయండి please


Saturday, 3 February 2018

గుడిలేదు గోపురంలేదు అయినా కోట్లాది జనం



ఈ రోజే జాతర చివరి రోజు కావటంతో , దేవతల వనప్రవేశంలోపు వెళ్లాలని ఉదయాన్నే బయల్దేరనుకున్నాం.



ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుంటే
 ఓ రెండున్నర గంటల్లో వెళ్ళొచ్చు కాని జామ్ అయితే అమ్మల దర్శనం కుదరదని
ముందుగానే రెడీ అయి వెళ్ళినా భయపడినంతా అయింది.
 ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంటన్నర ఆగిపోవాల్సివచ్చింది. ఎప్పుడూ  ట్రాఫిక్ జామ్ లు ఎరుగని మాకు ఇవి మాకు కాస్త విసుగనిపించింది. కానీ మా హైదరాబాద్ లాంటి నగరవాసులకు అలవాటే అని పక్క సీటు లో కూర్చున్నతను అన్నాడు. దాదాపు 200 కిలోమీటర్లు వన్ వే చేసినా, కొన్నిచోట్ల అధికార్ల సమన్వయలోపం, కొందరు వాహనదార్ల అత్యుత్సాహం, ముందుగా వెళ్ళాలనే తపనతో అడ్డ దిడ్డంగా వెళ్ళటం ట్రాఫిక్ జామ్కి కారణమట. అయినా మేడారం చేరేసరికి మధ్యాహ్నం రెండైనా
మా తమ్ముడి బంధువు గుడి దగ్గర డ్యూటీలో ఉండటంతో vip దర్శనం పది నిమిషాల్లో అయింది.
కాని గద్దెల దగ్గరికి వెళ్ళగానే మిత్రుడు చెప్పినట్టు
గుడిలేదు గోపురంలేదు                  
అర్చనలేదు అభిషేకం అంతకన్నాలేదు                           
తీర్థంలేదు తియ్యని లడ్డులేదు        
 మడిలేదు మంగళహారతిలేదు 
కోలవడానికి ఓ రూపంలేదు 
కలవడానికి ప్రత్యేకదారుల్లేవు   
ఉన్నదొక్కటే నమ్మకం 'అమ్మ' అంటే ఆకలితీరుస్తది' 
ఆనమ్మకమే 'సమ్మక్క-సారక్క అనిపించింది. 
ఒకప్పుడు వేళల్లో ఉన్న భక్తులు కోట్లకు చేరటమే అందుకు నిదర్శనం.
ఇక్కడ క్లిక్ చేయండి వివరాలకు 
తెచ్చిన బంగారం(బెల్లం), టెంకాయలు అమ్మలకు సమర్పించి 
బయటకు రాగానే జ్యోతిష్యం చేపుతామంటూ కోయదొరలు,
పూసలదండలు, రుద్రాక్ష మాలలు కొనండని ఒకరు,
బొమ్మలు కొనమని ఇంకొకరు, వాళ్ళందరిని తప్పించుకొని
తెచ్చుకున్న  భోజనాలు ముగించుకొని తిరుగుప్రయానమయ్యాం
అమ్మల ఆశీర్వాదంతో,

గిరిజన మ్యూజియం


వేలాది బస్సులు ఒకే చోట