విజయనగర రాజులు కట్టించిన
ఆలయాల నగరం (విజయనగరం)
హంపి ఎన్నో రోజులుగా
చూడాలనుకున్న కల నెరవేరింది.
శిథిల నగరంగా కనిపించే హంపి
యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో
చోటు సంపాదించుకుంది.
కనిపించే ప్రతి రాయిలోను దేవుడి ని
చూసే హిందువులకు
మహమ్మదీయుల దాడిలో ఇక్కడి
కూల్చివేసిన ఆలయాలు, విరగ్గొట్టిన
విగ్రహాలు బాధ కలిగిస్తాయి. అద్భు
ఆలయాలు, శిల్పాలు ఉన్నప్పటికీ
విరూపాక్ష ఆలయం లో మాత్రమే
పూజలు నిర్వహిస్తున్నారు.
ఎందుకంటే మిగతా విరిగిన
విగ్రహాలను పూజించడం
హిందూ సాంప్రదాయం కాదు
కాబట్టి. మొన్నామధ్య కోర్టు
మొట్టికాయలు వేసేదాకకూడా కర్ణాటక
ప్రభుత్వం పెద్దగా సంరక్షణ,
అభివృద్ధి పనులు
ప్రారంభించలేదు. హంపి లో బస
చేసేందుకు సౌకర్యాలు తక్కువ,
దగ్గర లో ఉన్న కమలాపురం,
హోస్పేటలోనే చూసుకోవాలి. హంపి
గురించి పూర్తిగా తెలియాలంటే
ఖచ్చితంగా గైడ్ ను
మాట్లడుకోవలసిందే. (500 రూ)
పూర్తి గా హంపి చూడాలంటే ఆటో
(500రూ) మాట్లాడుకోవడం మంచిది. ఇంకా సైకిల్ లు, జట్కా బండ్లు కూడా అద్దెకు దొరుకుతాయి.
మా గైడ్ ఉదయం 8 గం లకు హంపి
సందర్శన ప్రారంభించి
ముఖ్యమైన విఠల ఆలయం,
(మేము వెళ్ళినపుడు విఠల
ఆలయంలో పునరుద్దరణ పనుల
చేస్తున్నందున సందర్శనకు
పూర్తిగా అనుమతించలేదు ,) కోట,
లోటస్ మహల్, ఉగ్ర నరసింహలాంటి
ముఖ్యమైన ప్రదేశాలను చూపిం
మద్యాహ్నంకల్లా ముగించాడు..కా
పూర్తి గా చూడాలంటే కనీసం 3
రోజులైనా సరిపోదని చెప్పాడు. కర్ణాటక
టూర్ లో 1 వ రోజు ఇలా పూర్తి
అయింది.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Showing posts with label హంపి. Show all posts
Showing posts with label హంపి. Show all posts
Tuesday, 1 November 2016
కర్ణాటక యాత్రా విశేషాలు1
Subscribe to:
Posts (Atom)