అయ్యప్ప సన్నిధి నుండి తిరిగి పంప చేరుకోవడానికి దాదాపు 3.00 గంటలు పట్టింది. దేవస్థానం వారి వాహనాలు నడిచే రోడ్డుపై కాకుండా మెట్లదారి గుండా దిగాలి, కానీ కొంతమంది రోడ్డు గుండా దిగాం, కానీ సురక్షితంగా లేదు. పంపవద్ద BSNL మాత్రమే పనిచేస్తోంది. అలసిపోయిన మాకు భోజనం ముగించుకొని బస్సు ఎక్కగానే వెంటనే నిద్రపట్టింది. దాదాపు 60 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత చిన్న హోటల్ spicey.com దగ్గర ఆగాం. ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా వెళ్తున్నామన్న మా మాటలు విన్న మేనేజర్ మాతో మాట్లాడుతూ దగ్గరలోనే ఉన్న ఆలయం గురించి చెప్పడంతో మళయాలప్పుజ దేవి ఆలయానికి వెళ్లాం. భక్తుల తాకిడి కొంత తక్కువగా ఉంది. అయ్యప్ప దర్శించి వెళ్లేవారు చాలామంది ఇక్కడకు వస్తారట. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున స్టాల్ లో ఎర్రని విత్తనాలు అమ్ముతున్నారు. ఈ విత్తనాలతో దేవిని పూజిస్తే శత్రు బాధలు నివారింపబడతాయట. తర్వాత మా ప్రయాణం కేరళ రాజధాని తిరువనంతపురంకు.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Tuesday, 22 November 2016
Tuesday, 8 November 2016
శబరిమల
దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమలకు చెందిన
దట్టమైన అరణ్యంలో కొండకోనల మధ్య ఉన్న శబరిమలకు బయలుదేరి ఉదయాన్నే 3.30కి పంపానదికి చేరిన మేము వెంటనే నదీస్నానం చేసి హరిహర సుతుని దర్శనానికి బయల్దేరాం కాలినడకన. నడవలేని వారికి డోలీలు ఉన్నాయి. దేవస్థానం వారి డోలీలైతే మంచిది. 7 కిలోమీటర్ల దూరంకూడా బృందంగా వెళ్లేసరికి కష్టంగా అనిపించలేదు.
గర్భగుడికి
చేరేందుకు మాలధారులు మాత్రం పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి
ఉంటుంది. ప్రతి ఒక మెట్టు మనిషి లో ని ఒక లక్షణానికి
ప్రతీక అని ఒక నమ్మకం. మొదటి అయిదు మెట్లు
పంచేంద్రియాలని, తరువాత ఎనిమిది మెట్లు భావోద్వేగాలకి, ఆ
తరువాత మూడు మెట్లు మానవ గుణాలకి, చివరి రెండు మెట్లు
జ్ఞానం మరియు అజ్ఞానాలకి చిహ్నాలని అంటారు.
పరశురామ నిర్మిత ఈ ఆలయం 1907-1909 మధ్యకాలంలో
అగ్నికి ఆహుతి అవడంతో మరల
పునఃనిర్మించి శిలా విగ్రహానికి బదులు
పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం
పెరిగిందంటారు. ఒక గంట నిరీక్షణతోనే స్వామి దర్శనభాగ్యం కలిగింది. భక్తవత్సలుడి రూపం చూడగానే జేసుదాసు పాడిన పాట మనసులో మెదిలింది. శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శృతి
విభూషణం
స్వామి
సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయ
తర్వాత మాలిగపురంమాత ఆలయం, ఇతరత్రా దర్శించి వెనుదిరిగాం.
గురువాయూర్
గురువాయూరు
కేరళలో అడుగుపెట్టిన తర్వాత మేము దర్శించిన మొదటి
క్షేత్రం.
గతనెలలో శబరిమల వెళ్ళినప్పుడు మేము తక్కువ సమయంలో
ఎక్కువ క్షేత్రాలు దర్శించాలనే నా ఆలోచనతో ఎర్నాకులం వరకు
రిజర్వేషన్ చేయించినప్పటికీ త్రిసూర్ లోనే దిగాం. అక్కడి నుండి
గురువాయూరు, త్రిప్రయార్, బాహుబలి షూటింగ్ చేసిన
అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని శబరిమల వెళ్లాలని అని
నిర్ణయించుకున్నాం. రైలు ఆలస్యం, మాట్లాడుకున్న బస్ కూడా
లేటవడంతోమా ప్లాన్ తారుమారై అనుకున్నవి కాకుండా వేరే చూశాం.
ఆలయం సాయంత్రం 5.30 తెరుస్తారని పెళ్లాం కానీ
సూర్యాస్తమయం తర్వాత దీపాలంకరణ చేసిన తర్వాతే
తెరుస్తారు. కేరళ మందిరాలలో ప్రత్యేకత గర్భగుడి చుట్టూ
ఉండే
వేల దీపాలు, ప్రధాన ద్వారం ముందు ఉండే దీపతోరణాలు.
అలాగే ఇక్కడి ప్రాకారాలు ప్రత్యేకమైన ఆకారం
కలిగిఉంటాయి. ఇతర దక్షిణ భారతదేశ దేవాలయాలలా
గోపురాలు ఉండవు. సాయంత్రం కాగానే ఈ మందిరాలలో
దీపాలన్నిటినీ వెలిగిస్తారు. వీటికి ప్రత్యేకమైన
వ్యవస్థ కూడా ఉంటుంది.
ఓనం పండగ సమయం కావడంతో వేలసంఖ్యలో భక్తులుండడంతో
దర్శనానికి చాలా సమయం పట్టింది. మా తర్వాత ప్రయాణం
త్రిప్రయార్ కు. 8.30కల్లా గుడి మూసేస్తారని ఎంత వేగంగా
వెళ్ళినా 8.35 అయింది. నిరాశే. ఇక వాటరఫాల్స వెళ్దామంటే
రాత్రి కుదరదని నేరుగా శబరిమల బయల్దేరాం