Tuesday, 9 April 2019

ఇంకుడు గుంత

" ప్రపంచంలోని ఆధునిక నగరాలలో తాగునీరు సరఫరా నిలిచిపోబోతున్న  మొదటి నగరం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్  " (11 మే 2019 నుండి )
 కొంత కాలంగా  ప్రపంచమంతా చర్చిస్తున్న  ఒక అత్యంత  దూర్వార్త 
చుట్టూ సముద్రం ఉన్నా కేవలం 40 లక్షల జనాభా ఉన్న నగరానికి 
తాగేందుకు చుక్క నీటిని అక్కడి ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతోంది
కారణం ఏమిటో తెలుసా కోటిమంది జనాభా ఉన్న
మన  హైదరాబాద్ వినియోగించే నీటికంటే ఎక్కువగా వాడతారు
నీటి పొదుపు చేయండని అక్కడి ప్రభుత్వం
ఎంత మొత్తుకున్నా వినని నిర్లక్ష్యం ఇప్పుడు వారికి శాపంగా మారింది
ఇది ప్రారంభం మాత్రమే
ఇకనైనా మనం కళ్ళు  తెరవాలి

ప్రపంచంలోని 500 నగరాల్లో చేసిన పరిశోధనల్లో నీటి కరువుకు చేరువలో ఉన్న మొదటి 10 నగరాల్లో మనదేశంలోని బెంగళూరు రెండవది
1. సౌపాలో - బ్రెజిల్
2.బెంగుళూరు
3.బీజింగ్ - చైనా
4.కైరో - ఈజిప్ట్
5.జకార్త - ఇండోనేషియా
6.మాస్కో - రష్యా
7.ఇస్తాంబుల్  - టర్కీ
8.మేక్సికోసిటి
9. లండన్
10. టోక్యో - జపాన్ 

ప్రపంచంలో ఏ చిన్న వాతావరణ మార్పు జరిగినా 
మొదట  ప్రభావం చూపేది  భారత ఉపఖండం పైనే అనేది సుస్పష్టం 
ఇటువంటి పరిస్తితులల్లో 
నీటి కరువు మన దరిదాపుల్లోకి రాకూడదంటే
ఇంకుడు గుంతలే శరణ్యం అనేది శాస్త్రజ్ఞుల మాట
వాన నీటి సంరక్షణ లేకపోవడం వలన
నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తోంది.
దీన్ని అధికమించాలంటే ప్రతీ ఒక్కరు ఇంకుడుగుంతల అవశ్యాన్ని గుర్తించాలి.
ప్రభుత్వాలు  ఆదిశగా వాల్టా లాంటి కొన్ని చట్టాలు చేసినా
అమలులో అలసత్వం వలన భవిష్యత్ తరానికి
ఎంతో ద్రోహాన్ని చేస్తున్నాం
కురిసే వర్షంలో పట్టణాల్లో 92% వృధాగా పోతోందని అంచనా
ఈ విషయంలో పల్లెలు కొంచం నయం
చెరువుల్లోనో, ఫాంపాండ్స్ లోనో నిలువ చేసుకుంటున్నారు
ఇంకుడు గుంతల వంటి సంరక్షణ ఏర్పాట్లు ఉంటే
ఒక్క సంవత్సరంలో కురిసే వర్షంతో ఒక కుటుంబానికి
3 సంవత్సరాల పాటు సరిపోయే నీటిని  సేకరించుకోవచ్చు
కాబట్టి ప్రతీ ఒక్కరు వాటి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి


ఇంకుడు గుంత నిర్మాణం:
సుమారు రెండు మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతలను త్రవ్వాలి.
ఆ గుంతలో పావు భాగము పెద్ద బండ రాళ్ళతో నింపాలి,
ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకర,  తర్వాత చిన్న కంకరతో  నింపాలి.
ఆపైన కర్ర బొగ్గుతో ఒక వరుస వేయాలి 
దాని పైన దొడ్డు ఇసకను వేయాలి, 
వర్షపు నీటిని ఆ గుంతలోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి 
ప్రతీ సంవత్సరం పైన ఉన్న ఇసకను మార్చాలి 
లేదా బయటకు తీసి కడిగి మల్లి వేయాలి 
మీ ఇంటి, వ్యవసాయ బోర్లు, బావుల్లో జలసిరులు చేరాలంటే 
ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు 
దీనికి ప్రభుత్వం తరపున సహాయం కూడా అందుతుంది


Monday, 25 February 2019

విషకౌగిలిలో దీర్ఘాయుష్షు


దీర్ఘాయుష్మాన్ భవ అని ఎవరైనా దీవిస్తే  భయమేస్తోంది!!
అయినా
30 ఏళ్లకే బీపీ 35 కు షుగరు
40 కి రాగానే గుండెపోటు 45 కి రాగానే ఏదో కాన్సర్  
లేదంటే పక్షవాతం.... ఇక వందేళ్లు బతకాలని ఎవడనుకుంటాడు
అన్నాడు మిత్రుడొకరు
ఔను! మన కంటే ఒకటి రెండు తరాల ముందు వాళ్ళు బాగానే ఉండే వాళ్ళు 
మరి మన కి ఏమైంది??
ఏముంది
1960-70 లో హరిత విప్లవంతో మొదలైన 
విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగుమందుల
వాడకం కాస్తా మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది
వ్యవసాయ భూముల్లో వరి,పత్తి, మిరప,
కూరగాయలు మరేఇతర వ్యవసాయ పంటలు వినియోగిస్తున్న
రసాయనాలు (అగ్రోకెమికల్స్) నేరుగా
చెరువుల్లోకి అక్కడినుండి బోర్లు, బావుల్లోకి ఇంకా నదుల్లోకి చేరుతున్నాయి.
దాంతోభూగర్భ జలాలు
కలుషితమవుతున్నాయి అలా కలుషితమైన
నీటినే వంటకు, తాగడానికి వాడుతున్నాం 
అదే ఈవ్యాధులకు ముఖ్య కారణమని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి 
అయినా ఇవి ఒక కొలిక్కి రావడంలేదు ఎందుకంటే ఇవి
పరస్పర ఆధారిత మరియు బహుళ విభాగ
పరిశోధనలతో ముడిపడి ఉంటాయి


అదీకాక మనం తినే ఆహారంలో 
పురుగుమందులు, రసాయనాల అవశేషాల స్ధాయి చాలా ఎక్కువట. 
ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసిన తర్వాత 
పంటలు (ఆకు కూరలు, కాయగూరలు) కోయటానికి 
కనీసం పది రోజులు ఆగాలి కానీ అలా జరగడం లేదు.
లేదంటే అలాంటి కూరల వల్ల నాడివ్యవస్థ, నరాల
వ్యవస్థ దెబ్బతింటుంది.. కాలేయం పనితీరు పాడయ్యే
అవకాశం ఉంటుంది. మూర్చ వచ్చే ఆవకాశం ఉంటుంది. రోగ నిరోధక
శక్తి తగ్గిపోయి చిన్నచిన్న వ్యాధులకు కూడా శరీరం
తట్టుకోదు. తరచూ జలుబు, తలనొప్పి వస్తుంది. నీరసంగా ఉంటుంది.
కొన్ని మందుల వల్ల క్యాన్సర్ వంటివి కూడా సోకే ప్రమాదం కూడా ఉంది.
వాహనకాలుష్యంతో  వెలువడే పొగలో ఉండే సీసం, మరికొన్ని రసాయనాల వల్ల క్షయ, మెదడు సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి 



ఇక రెస్టారెంట్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే అజినమోటో, వెనిగర్, ఫుడ్ కలర్స్ లాంటివే కాక నిలువ ఉంచేందుకు వాడే రసాయనాలు ఎన్నో ...
మరో విషయం కూడా పరిగణనలోకి
తీసుకోవాలి. చిన్న చిన్న జలుబు,దగ్గు,జ్వరం లాంటి జబ్బులకు,
చీటికీ మాటికి ఆర్.ఎం.పి.ల ప్రెస్క్రిప్షన్ తో మందుల గోళీలు
వాడటం కూడా ఆరోగ్యం దెబ్బతినటానికి ఓ కారణం . 
క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో వాడాల్సిన కొన్ని మందుల్ని  RMP లు అతి సాధారణంగా వాడేస్తున్నారట. దాంతో అత్యవసర పరిస్థితుల్లో ఆయా మందులకు జబ్బులు లొంగటం లేదు అనేది కొన్ని పెద్ద ఆసుపత్రుల ఫిర్యాదు..
చీటికీ మాటకి మందులు మింగకుండా,
రసాయనాలతో కూడిన ఆహారాన్ని త్యజించి సేంద్రీయ ఆహారం తీసుకునే దిశగా ప్రయత్నిస్తూ అందరూ కాస్త అవగాహన పెంచుకుంటే వందేళ్లు బతికినా బాధ ఏమీ ఉండదు..
ఎవరికీ భారమవ్వరు..

                                          దీర్ఘాయుష్మాన్ భవ

Friday, 15 February 2019

రెండు రోజుల్లో పంచారామాలు ...

బిజీ బిజీ జీవితంలో కాస్త విశ్రాంతి కోసం అలా ఓ రెండ్రోజుల 
ఏదైనా విహారాయాత్రకు వెల్దామని నిర్ణయించుకున్నదే తడవుగా  
మా మిత్రులందరూ మేము సైతం అంటూ ok చెప్పారు
మరి ఎటు వెళదాం??
విహారయాత్రకు.....
ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు..
ముక్కోటి దేవతలు కొలువైన ఆలయాలు..
ఆకుపచ్చని అరణ్యాలు..
ఆకాశం నుండి దూకే జలపాతాలు..
ఎన్నో ఉన్నా ఈసారి ప్రకృతి రమణీయతకు, 
అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రాలకూ 
నెలవుగా ఉన్న గోదావరి జిల్లాలోని
పంచారామ క్షేత్రాలను చుట్టి రావాలనుకున్నాం
సమయం అనుకూలిస్తే మధ్య మధ్యలో ఉండే 
ఇతర క్షేత్రాలను చూడాలనుకుంటున్నాం
వెళ్తున్నామనగానే ఎక్కడ ప్రారంభించాలి, ఎలా వెళ్ళాలి, 
ఎక్కడ బస చేయాలి, ఎక్కడముగించాలి అని కొందరు మిత్రులు  
వారి అమూల్యమైన సలహాలు,సూచనలు  తెలియజేసారు 
వారందరికీ  ధన్యవాదాలు. 
 రెండు రోజుల్లో చుట్టి రావడానికి ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటె 
కామెంట్ చేయండి please


Saturday, 26 January 2019

ఫోన్ సెన్స్


మన దేశంలో దాదాపుగా ప్రతీ ఒక్కరికి ఫోన్ ఉంది
ఇంకా కొందరికి రెండు కూడా ఉన్నాయి
భారత టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం
31 డిసెంబర్ 2018 నాటికి మనదేశంలో
121 కోట్ల సెల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని అంచనా
అందులో 50 కోట్ల వరకు స్మార్ట్ ఫోన్లే
ఇంకా ల్యాండ్ ఫోన్లు అదనం .....
పుస్తకం హస్త భూషణం అనేవారు ఒకప్పుడు, మొబైల్ హస్తభూషణం అయిపోయింది ఇప్పుడు
కానీ ఈ ఫోన్లు మనుషుల పరువు తీయటమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెస్తున్నాయి

మొన్నొకతను బస్ లో ఫోన్ మాట్లాడుతూ టికెట్ తీసుకోవడమే మరిచిపోయాడు
దాదాపు 20 కిలోమీటర్లు వెళ్ళినతర్వాత గుర్తుకొచ్చింది పాపం
ఇంకొందరికైతే ఎప్పుడూ ఫోన్ చెవికి ఆనించే ఉంటుంది ఆఫీస్ అయినా రోడ్ మీదైనా
మనమెవరితోనైనా మాట్లాడుతూ ముఖ్యమైన ఉంటామా
ఇంతలో వాళ్లకు  ఫోన్ వచ్చిందనుకోండి మనల్ని మరిచిపోయి మరీ అందులో లీనమైపోతారు
అదేమైనా ముఖ్య విషయమా అంటే ఏ పార్టీకో వస్తావా అనో నిన్న చూసిన సినిమా గురించి రివ్యూ నో అవుతుంది
కానీ ఎదురుగా ఉన్న మనిషిని పట్టించుకోవడం ఉండదు. కొందరైతే  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు
 ఒకసారి నాకు తెలిసిన ఒకతను అలా మాట్లాడుతూ వెళ్లి ఒక  కరెంటు  ట్రాన్స్ఫార్మర్  మీదే చెయ్యి వేయబోయాడు.
పక్కనే ఎవరో ఉండి ఆపారు కాబట్టి సరిపోయింది లేదంటే ....
ఇంకొకాయనైతే ఒక బస్సు  ఎక్కాల్సింది ఇంకోటి ఎక్కాడు.
ఇంకా చాలా చూస్తున్నాం హెడ్ సెట్ పెట్టుకొని రోడ్డు దాటేవాళ్ళు ప్రమాదాలకు గురికావటం,
సెల్ఫీలు దిగుతూ, ఫోన్ మాట్లాడుతూ బండి నపడం వల్ల ప్రమాదాలకు గురికావడం .
ఇంకా కొందరైతే మనకు ఫోన్ చేసి ఇంకెవరితోనో మాట్లాడుతూవుంటారు
  
ఆఫీసులో ఉన్నప్పుడు పర్సనల్ కాల్స్ తక్కువగా అటెండ్ చేయడం మంచిది
మిత్రులు, బంధువుల మధ్య ఉన్నప్పుడు ఫోన్ కంటే వాళ్ళకే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇవ్వడం మంచిది
దానివల్ల వాళ్లు మనల్ని గౌరవంగా చూడడమే కాకుండా వాళ్ళు మనకు ముఖ్యులు అనే నమ్మకం వాళ్లకు కలుగుతుంది
సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్  వచ్చాక బంధాలు , బంధుత్వాలు పలచబడుతున్నాయి,  ప్రేమలు తగ్గుతున్నాయి
నా చిన్నప్పుడు TV  వచ్చి కుటుంబ సభ్యల మధ్య దూరం పెంచింది అనేవారు
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు బంధాలను పూర్తిగా తెంచేలా ఉన్నాయి
హాస్పిటల్స్ కి వెళ్ళినపుడు సెల్ ఫోన్లు ఆఫ్ చేయడం మంచిది
ఒక్కోసారి ఫోన్ రేడియేషన్ వల్ల అక్కడి కొన్ని పరికరాలు పనిచేయకపోవచ్చుకూడా
దాంతో రోగులకు సరైన సమయంలో అత్యవసరమైన వైద్యం అందించలేకపోవచ్చు
ఫోన్ ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఎందుకు  మాట్లాడకూడదో ఎవరో వచ్చి చెప్పరు కదా 
కాబట్టి మనమే కాస్త విచక్షణతో వ్యవహరించటం మంచిది 

Tuesday, 30 October 2018

వెలుగుల దీపావళికి చీకటి బహుమతి


ఈమధ్య కోర్టులు హైందవ ఆచారాలకు, విధానాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం
హిందువుల్లో తీవ్ర నిరాశకు, న్యాయ వ్యవస్థ పట్ల వ్యతిరేకతకు కారణమవుతున్నాయి
 మొన్న శబరిమలలో ఆడవారి ప్రవేశం గురించిన తీర్పు
ఇప్పుడేమో దీపావళికి రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలని..
ఎక్కడున్నాం మనం..
 హిందూ దేశంలో నా లేక పోతే ఇంకేదైనా దేశంలోనా
హిందూ పండుగలంటే ఎందుకంత చులకన అంటూ మండిపడుతున్నారు.
రెండు గంటల సమయం ఎవడికి సరిపోతుంది
దీపావళి దక్షిణాదిలో రెండు రోజులు జరుపుకుంటారు
కానీ ఉత్తరాది వారైతే వారంపాటు ఘనంగా జరుపుతారు
ప్రపంచ వ్యాప్తంగా హిందూ పండగలని అన్ని మతాలవారు ఘనంగాజరుపుతూ ఉంటే
మన దగ్గర సెక్యులర్ ముసుగులో హిందుత్వాన్ని , ఆచారాలను, సాంప్రదాయాల్ని
అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
హిందూ పండగల్లో ఉండే ప్రతీ కార్యక్రమం  ఒక శాస్త్రీయ  కారణాన్ని,
ఇంకా అనేక ఆరోగ్య రహస్యాల్ని కలిగి ఉంటుంది.
ఈవిషయం ప్రపంచమంతటికీ తెలుసు
కానీ ఇక్కడి కొందరు హేతువాదులు, కుహనా లౌకిక మేధావుల వల్ల ఇక్కడ
తరచుగా వివాదాలలోకి లాగబడుతోంది .
ముఖ్యంగా వినాయకచవితి, దీపావళి పండగల విషయంలో కాలుష్యం పేరుతొ
నిబంధనలు విధించడంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
నిజానికి దీపావళినాడు టపాసులు కాల్చడంవల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఏడాదికొకసారి సంభవించే ఈ కాలుష్యం యొక్క  ప్రయోజనాలేమిటో తెలుసుకుంటే 
ఈ శుభ సాంప్రదాయం పట్ల ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి,  
ఇటువంటి ఆచారాల్ని త్యజించటం వాళ్ళ కలిగే నష్టాలు కూడా బోధ పడతాయి.
దీపావళి వర్షాకాలం పూర్తిగా గడచిన తర్వాత వస్తుంది 
టపాకాయలు కాల్చటం వల్ల వర్షాకాలంలో విపరీతంగా పెరిగిన క్రిమికీటకాలను నిర్మూలించవచ్చు 
దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది . టపాకాయల్లో వాడే గంధకం వల్ల పప్పుదినుసుల పంటలు 
ఏపుగా పెరిగి దిగుబడికూడా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి . 
చలికాలంలో వేసేది కూడా ఎక్కువగా ఆ పంటలే 
ఇంకా గంధకానికి ఎంతకూ తగ్గని మొండి చర్మ వ్యాధుల్ని(fungal infections) కూడా తగ్గించే గుణం ఉంది 
అందుకే గంధకపు వేడినీటి చెలిమెలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది
 ప్రతిరోజు వెలువడే కాలుష్యం వదిలేసి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగే పండగలకు నిబంధన విధించడం ఏమిటి  ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో పేల్చ బాణాసంచా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దీనిపై  స్పందన ఏమీ ఉండదు అంటూ హిందూ సంఘాలు మండి పడడంచూస్తూనే ఉన్నాం
 శబ్దము మరియు పొగ తక్కువగా వచ్చే టపాకాయలను తయారుచేయాలని కంపెనీలకు సూచిస్తే బాగుంటుంది విదేశాల నుంచి దిగుమతి అయ్యే అటువంటి టపాకాయలను నిషేధిస్తే ఇంకా మంచిది ఆ వైపుగా చర్యలు తీసుకోకుండా సాధారణ ప్రజల పై తీర్పులను రుద్దడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది ఎన్నో ఏళ్ల నుంచి మూలన పడి ఉన్న కేసులు కాకుండా ఇటువంటి కేసుల్లో ఏదో కొంపలు మునిగిపోయినట్లు అత్యంత త్వరగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఏముందో.
 కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వడం వలన ప్రజలకు కోర్టు పైన ఉండే సదభిప్రాయాన్ని కోల్పోతాయి తప్ప ఒరిగేదేమీ లేదు

Saturday, 4 August 2018

ప్లాస్టిక్ కు దూరంగా ఉండలేమా

"ప్లాస్టిక్ నిషేధం
మాటలకే పరిమితమైన ఒక గొప్ప ప్రణాళిక

ప్లాస్టిక్ కవర్ల వల్ల
పర్యావరణానికి చేటని ఎంతో మంది నిపుణులు
చెబుతున్నా ఆ మాటలను పెడచెవిన పెట్టి
యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది.
ఇంకా..
ప్లాస్టిక్ తీవ్రమైన వాతావరణం కాలుష్యం కలిగిస్తుంది అనేది
అందరికి తెలిసిన గొప్ప సత్యం కానీ మానటం అయిష్టం 
ఎందుకంటే అంత చవకలో మరో ప్రత్యామ్నాయం లేకపోవటం కారణం

కిరాన సరకులు, మందులు తెచ్చుకున్నా , కూరగాయలు,హోటళ్ళనుండి ఇలా కవర్లలో  టీ, టిఫిన్ లాంటి వేడి  ఆహార పదార్థాలు ప్యాక్ చేసినప్పుడు పేగులు, కడుపు సంబంధిత కాన్సర్ లను కలిగించే రసాయనాలు తీవ్ర స్థాయిలో ఆహారం లో కలుసున్నట్టుగా కనుగొన్నారు.


ప్లాస్టిక్ కవర్ల నిషేధంలో భాగంగా 40 మైక్రాన్ల  కంటే మందంగా  ఉండే
కవర్లే వాడాలనే నిబంధన ఉంది కానీ ఇవికూడా భూమిలో త్వరగా కరిగిపోవు,
కానీ పునర్వినియోగానికి అవకాశానికి అవకాశముంటుంది,
వ్యాపారులు కూడా ఆర్ధిక భారం తో
వాడకం తగ్గిస్తారనే ఆలోచన అయివుండొచ్చు.
ప్లాస్తిక్ వినియోగాన్ని క్రమబద్దీకరించి నిషేధాన్ని సరిగా
అమలు పరచటంలో విఫలమైన దేశాల్లో మనది ఒకటి.


కవర్లు పారవేయడం వల్ల భూమిపై ఒక పోరలాగ ఏర్పడి వాన నీటిని ఇంకకుండా అడ్డుకుంటున్నాయి  దాంతో నీటి కరువు ముప్పు పొంచి ఉంది.

ఇంకా సముద్ర కాలుష్యం లో దాదాపు80 శాతం ప్లాస్టిక్ వే ఉంటున్నాయి.
జలచరాలు, పశుపక్ష్యాదుల మరణానికి కారణమౌతోంది 



మనిషిఅలసత్వమే ముఖ్య కారణంగా
మనకి జీవనాధారమైన  గాలి, నీరు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి

ప్లాస్టిక్ కవర్లతో జరిగే నష్టాలను ప్రజలకు
తెలిసే విధంగా ప్రభుత్వం, మేధావులు కృషి చేయాలి.
ప్రత్యామ్నాయాలు చూపిస్తూ
మెల్లమెల్లగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం నుంచి
దూరం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ప్రతి ఒక్కరూ బాధ్యత గా  ప్లాస్టిక్  వినియోగాన్ని నిలిపివేసినప్పుడే మీపిల్లలు
 " నేను పెరిగి పెద్దవాడినయ్యే వరకు ఈ అందమైన ప్రకృతిఇలాగే ఉంటుందా?
అని అడిగితే
ఉంటుంది అని సమాధానం ఇవ్వగలరు 

కాబట్టి  నేను ప్లాస్టిక్ వాడను అని  వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి.
మార్కెట్కు వెళ్ళినా, కిరాణా షాపుకు వెళ్ళిన
ఒక సంచి తెసుకొని వెళ్ళటం అలవాటు చేసుకోండి 

అందమైన ప్రకృతి, ఆరోగ్యకర జీవితాన్ని
పిల్లలకందివ్వలేనపుడు ఎన్ని కోట్లు కూడబెట్టి వారికిచ్చినా ఫలితం శూన్యంకదా !!!

Monday, 30 July 2018

పచ్చని చెట్టు ప్రాణభిక్ష పెట్టు

నాలుగు రోజుల క్రితం ఉదయాన్నే ఊరికి బయలుదేరా, 
బస్టాండ్ లో ఎప్పుడూ మనం ఎక్కాల్సిన బస్సు తప్ప అన్నీ ఉంటాయి 
కానీ  బస్టాండ్ కు వెళ్ళగానే ఎక్కాల్సిన బస్ కనపడింది, అదృష్టం అనుకున్నా . 
వెళ్లాల్సిన ఊరికి ఒక గంటన్నర  ప్రయాణం. 
బస్ బయల్దేరాక గంటకు చిన్న పల్లెటూరులో ఓ ఐదుగురు బడిపిల్లలు ఎక్కారు
నా ప్రక్కనే ఒక అబ్బాయి ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. 
బడికి వెళ్లటం ఇష్టం లేదేమో అని అడిగా.
కాదు అంటూ తలూపాడు.
మరింకేంటి అడిగా..
మాఇంటిముందు ఉన్న రెండు చెట్లూ కొట్టేస్తున్నారు అన్నాడు.
అయితే నువ్వెందుకు ఎడుస్తున్నావు అన్నా
రోజు ఉదయం, సాయంత్రం వాటికిందే కదా మేము ఆడుకునేది , 
దానికి ఉన్న ఊయల కూడా తీసేశారు,
మా టీచరేమో చెట్లు  లేకుంటే ఆక్సీజన్ ఉండదు 
అది లేకుంటే మనం చచ్చిపోతాము అంది. చెట్లు తీసేస్తే మాకు ఆక్సీజన్ ఎట్లా? 
మా ఇంట్లోవాళ్ళంతా చనిపోతామా అంకుల్ అన్నాడు.
ఏం మాట్లాడాలో తెలియలేదు
ఊళ్ళో బోలెడు చెట్లు ఉన్నాయి కదా ఏమీ కాదులే అన్నానే  కానీ
ఇలాగే చెట్లు నరికేస్తూ వెళ్తే  భవిష్యత్ఏ తరాల పరిస్థితి ఏమిటి అని
ఆ పిల్లవాడిలా కాకున్నా కొంత  తెలియని ఆందోళన నాలో కూడా  అనిపించింది .
చిన్నపిల్లవాడి లాగా కూడా మనం ఆలోచించడం లేదే అనిపించింది.

ప్రకృతే ఆధారంగా మన కథ ఆరంభమైంది.
కానీ ఆ ప్రకృతినే నాశనం చేస్తూ ఎదుగుతున్నాం.
ఇంత అందమైన ప్రకృతి ని  స్వార్దంతో పాడు చేస్తూ
భవిష్యత్  మానవాళికీ  ముప్పు తెస్తున్నాం .
ఇలాంటిది నేను ఒక సారి బెంగుళూరు లో చూసాను 
నిజానికి చెట్లు నరికి వేయటం, అడవులు తగ్గిపోవటం వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి.

ఈమధ్య కాలంలో బాగా పెరిగిన గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పులు
పచ్చని పరిసరాలకు ఎంత సమీపంలో జీవిస్తున్నారనే దాంతోనూ ముడిపడి
ఉంటున్నాయి
పిల్లల్లో ఊబకాయం సమస్య కు చెట్లు లేకపోవడం వలన కలిగే
గాలి కాలుష్యం కూడా ఒక ముఖ్య  కారణం
పచ్చని ప్రకృతి మధ్యలో గడిపిన తర్వాత ఎదుటివారి పట్ల
దయ, నమ్మకం పెరుగుతున్నట్టు, కాలిఫోర్నియా
విశ్వవిద్యాలయం వారి పరిశోధన చెబుతోంది
పార్కులు,చెట్లతో కూడిన వీధులు గల చోట్ల నివసించే వృద్ధులు ఐదేళ్లు ఎక్కువగా
జీవిస్తున్నట్టు జపాన్ పరిశోధకులు చెప్తున్నారు
ప్రకృతి సన్నిధిలో గడపటం వలన ఒత్తిడి హార్మోన్ల
స్థాయులు బాగా తగ్గి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటాని దోహదం చేస్తుంది.
వినోద సాధనాలకన్నా ఇదే ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది
అంతేకాక ఇవి శబ్ద మరియు ధూలి కాలుష్య కారకాల వడపోతకు ఒక ముఖ్య సాధనంగా పని చేస్తాయి, దాంతో క్షయ వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు 


చెట్టులోనూ దేవుణ్ణి చూసే మనకు ఇలాంటి పరిస్తితి వస్తే???
క్లైమేట్‌ రియాలిటీ ప్రాజెక్టు సర్వే ప్రకారం భూమ్మీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లుంటే.. భారత దేశంలో సగటున 28 మాత్రమే ఉన్నాయన్నారు.

వృక్షాలు నరికేస్తూ పొతే భూగోళం ఎడారిగా మారేందుకు ఎంతో సమయం పట్టదు
33శాతంగాఉండాల్సిన అడవులు క్రమేపి తగ్గుతూ ఉండటం వల్ల
ఓజోన్ పోరా దెబ్బతిని ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి
భూగర్భ జలాలు, భూసారం క్షీణిస్తున్నాయి.
కరువు కాటకాలు, ప్రకృతి  వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్నాయి

మనిషి జీవితంతో, ఆరోగ్యంతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నపుడే
నేటి మన పిల్లలు పెద్దయ్యే సరికి అందమైన ప్రకృతితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని
ఆయుష్షును వారికి అందించవచ్చు