Showing posts with label కర్ణాటక యాత్ర. Show all posts
Showing posts with label కర్ణాటక యాత్ర. Show all posts

Tuesday, 1 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 2

ఇక హంపి నుండి మా ప్రయాణం
నేరుగా త్రిశైవ క్షేత్రాలో ఒకటి అయిన
ఆత్మలింగ క్షేత్రం గోకర్ణంకు.
(మిగతా రెండు కాశీ, రామేశ్వరం ) 2వ
రోజు ఉదయం 4 గంటల కల్లా చేరిన
మేము హోటల్ రూం తీసుకుని ,
స్నానాదులు ముగించుకొని
8గంటలకు ఆలయాని బయలుదేరి
పెళ్ళిన మాకు ముందుగా
వినాయకుడిని దర్శించుకోవాలని
చెప్పడంతో బాలగణేశుడిని
దర్శించుకొని ప్రధానాలయం లోకి
వెళ్లే సరికికాస్త రద్దీగా ఉన్నప్పటికీ
1గంటలోనే అభిషేకం పూర్తి చేసుకొ
బయటకు రావడంతోనే పూజారుల
ద్వారా క్షేత్రం లో పిండప్రదాన
ప్రాధాన్యత తెలుసుకొని మిత్రులతో
కోటితీర్థం వెళ్ళాము. (గుడి నుం
అరకిలోమీటర్) ఇక్కడ గడిలోనూ,
కోటితీర్థం దగ్గర తెలుగు మాట్లాడే
పూజారులు ఉన్నారు, కాబట్టి
ఇబ్బంది పడలేదు. మా పిల్లలు
మాత్రం సరదాగా బీచ్ వైపు వెళ్ళారు.
ఇక్కడ నుండి మధ్యాహ్నం 1
గంటకు బయలుదేరిన
మేము సమయాబావం వలన
కొల్లూరు మూకాంబిక ఆలయానికి
వెళ్ళగలమా లేదా అనుకుంటూనే
మురుడేశ్వర్ బాట పట్టాము.