Thursday 17 August 2017

కన్నీరే మిగిలిందిక


వృద్ధులను బాగున్నావా? అని పలకరిస్తే ఆనందం కన్నా కన్నీళ్ళే రాలుతున్నాయి .
 తగ్గుతున్న మానవత్వ విలువలకు నిదర్శనం ఇది.
ఈ రోజు కంటి చూపు పరీక్ష చేయించుకుందామని ఆసుపత్రికి  వెళ్ళాను.
నాలాగే చాలా మంది వచ్చారు, అందులో వృద్ధులే ఎక్కువ . 
తెలిసిన వారి హాస్పిటల్ కాబట్టి 
ఎక్కువగా వెయిట్ చేయాల్సిన పని లేదు కాని 
డాక్టర్ లంచ్ చేస్తుండటంతో పావుగంట ఆగాల్సివచ్చింది.
వచ్చిన పేషంట్లలో కొంత మంది తెలిసిన వాళ్ళు
ఉండటంతో మాటలు కలిపాను.
వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటూ వీళ్ళకు కొంత డబ్బు పంపిస్తున్నారట,
పండక్కో పబ్బానికో కానీ రావటంలేదట ,
 కొందరైతే అదీ లేదట ఎన్ని సంవత్సరాలైందో
అని కన్నీటి పర్యంతమయ్యారు.
వాళ్ళను పెంచి పెద్ద చేసేందుకు తెచ్చిన అప్పులే తీరలేదట.

 అమ్మా నాన్నలను మిస్ అవుతున్నట్టు ఫేస్బుక్ వాట్స్ అప్ స్టేటస్ లు పెట్టేకంటే
రోజు ఒక్కసారైనా ఫోన్ లో పలకరిస్తే ఎంత ఆనందిస్తారో.
తల్లి దండ్రులకు శుభాకాంక్షలు చెప్పటమంటే
జీవితాంతం వాళ్లకి సేవ చేయటమే కాని
స్టేటస్ లు పెట్టడం కాదు.
అయినా స్వతంత్ర భావాలకు అలవాటు పడి
ఏదైనా మనకెందుకులే అని బ్రతుకుతున్న వాళ్లకి
ఇదంతా ఎప్పుడు బోధపడుతుంది  అత్యాశ కాకపొతే...



3 comments:

  1. సైరా చౌదరి మళ్ళీ విషం కక్కుతున్నాడు..

    ReplyDelete
  2. dear sir good telugu blog nice telugu articles
    Latest Telugu News

    ReplyDelete