Sunday 12 March 2017

ఒక్కో అడుగు దివాలా వైపు


ఒరేయ్ ఎల్లయ్య!
మొన్న కొన్ని గొర్లు అమ్ముతే వచ్చిన
 రొండు లచ్చలు బ్యాంకుల ఎయ్యాలెరా
 జర  వత్తవా బ్యాంకుకు.
అరే! మల్లిగా....
నీకు దెల్వదా  ఇప్పుడు బ్యాంకుల
పైసలు ఏసినా తీసినా మనకు చార్జి పడుతదట.
ఇంగో గట్ల గాదుగని మన సావుకారి దగ్గర పెడుదాంర
వడ్డికీ వడ్డీ ఇస్తడు పైసలుగూడ ఎప్పుడంటే గప్పుడు ఇస్తడు.
కార్పోరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే మన బ్యాంకులు
 సామాన్యులంటే చులకనగా చూస్తూ
 సవాలక్ష నిబంధనలు
నెలకు ఇన్ని లావాదేవీలే, మినిమం బ్యాలెన్సు
 ఇంత అంటూ పెడుతున్నాయి.
అదే సామాన్యుడికి మండితే బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా
 ఒక్కసారిగా తీసుకుంటే పరిస్థితేంటి .మార్చిలో టార్గెట్ చేరుకోలేక
 రేటింగ్ పడిపోయి దివాలతీయవా?
సామాన్యులు చేసే డిపాజిట్లను వడ్డీలకు తిప్పుకుంటూ
 బతికే బ్యాంకులువాళ్ళకే ఇలా   అర్థం పర్థం లేని
 నిబంధనలు పెడితే ఎలా
మోడీ ఎఫెక్టు తో  ఒక్క నెల బ్యాంకులు కలకలలాడగానే కళ్ళునెత్తికెక్కాయ?
పూర్తిగా డిజిటల్ పేమెంట్ దిశగా అడుగులు వేద్దామన్న
 తరుణంలో ఇటువంటి నిర్ణయాలు శరాఘాతాలే. ఇప్పటికైనా  RBI
  పునరాలోచించుకోవాలి . కస్టమర్లు పోస్తాఫిసులవైపు
 వెళ్ళకముందే కల్లు తెరుస్తే మంచిది .
ఇప్పటికే చాలామంది paytm లాంటి Ecomerce సైట్లు  వాడు తున్నారు.
ఇక అందరూఅటువైపు వెళ్తే బ్యాంకులు జీతాల టైంలో తప్ప ఇంక వాడరు.
అప్పుడు దివాళాతీయక తప్పదు.
కాబట్టి ఏ నిర్ణయమైనా సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది .
చూద్దాం ఏంజరుగుతుందో.......

1 comment: