Friday 6 January 2017

ముక్కోటి ఏకాదశి

         ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూపుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారతయుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజునఉపదేశించాడని విశ్వాసం ఉంది. 

ముక్కోటి ఏకాదశిధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిపవిత్రమైనది.

విష్ణు ప్రీతికరమైన
ఏకాదశులలో ఇది అత్యంత
ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం
మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే
రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ
'ఏకాదశి' రోజున వేయికనులతో
వీక్షించి సేవించి తరంచి
పోవాలని మూడు కోట్లమంది
దేవతలు వైకుంఠమునకు చేరుకునే
పుణ్యప్రదమైన రోజు కనుక ఇది
వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి
ఏకాదశి" గా
భక్తులు పిలుస్తూ ఉంటారు.
ఇట్టి
పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో
పూర్ణిమకు ముందు వచ్చే
ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో
(తిరుపతి,
భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి వైష్ణవ)
పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే,
ఉత్తర ద్వారాలను మూసి
ఉంచుతారు. ఈ "ముక్కోటి
ఏకాదశి" రోజున
మాత్రం వాటిని తెరచి
ఉంచుతారు. ఆ
రోజు భక్తులు సూర్యోదయానికి
పూర్వమే నిద్రలేచి
కాలకృత్యములు,
స్నానసంధ్యాదులు ముగించుకొని
అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర
ద్వారం ద్వారా ప్రవేశించి
ప్రదక్షిణలు ముగించుకుని
దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు.
అలా ప్రదక్షిణ క్రమాన్నే
"ముక్కోటి ప్రదక్షిణ" అని
పిలుస్తూ ఉంటారు.

No comments:

Post a Comment