Friday 27 January 2017

పట్టుపట్టి జల్లికట్ట్టు

నెమ్మదిగా హిందువుల పండుగలు, ఉత్సవాలను కనుమరుగు చేసేందుకు జరుగుతున్న కుట్రలు న్యాయస్థానాలనుకూడా ప్రభావితం చేసి తమకనుగుణంగా తీర్పు రాబట్టడంలో సఫలీకృతం అవుతున్నాయి కొన్ని విదేశీ శక్తులు.
భారత దేశ వెన్నుముక
అయిన తన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాని
చిన్నాభిన్నం చేయకుండా మనం ఆ దేశాన్ని ఆక్రమించగలమని
నేను భావించటం లేదు అని  అన్న మెకాలే వారసులు విదేశీ విష సంస్కృతిని మన పై రుద్దుతూ వారసత్వ పండుగలు, ఉత్సవాలను అపహాస్యం చేస్తున్నారు. వీరికి కొన్ని విదేశీ సంస్థలు సహకరించడం, ఇంకా మన  సెలబ్రిటీలు తందాన అని వంతపాడుతూ వకాల్తా తీసుకోవడం....
        కొన్ని సార్లు కోర్టులు కూడా సాంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తమపరిధిని అవసరానుగుణంగా  మార్చుకొంటే  బాగుంటుంది. ఎక్కడో విదేశాల్లో పుట్టిన పండగలు, ప్రత్యేక దినాలు జరుపుకునే మనం మన సాంప్రదాయాలను ఎందుకు కొనసాగించలేకపోతున్నాం . అంటే వారి సాంప్రదాయాలు మాత్రమే గొప్పవనే విషబీజాన్ని మన మదిలో నాటుతున్నారు.

తమిళనాడు లో జల్లికట్టు, కర్ణాటక లో కంబల, మహారాష్ట్ర లో ఎడ్ల బండ్ల పందాలు, తెలుగునాట కోళ్ళ పందాలు మరోచోట మరోటి... ఏదైతేనేం. ఉత్సవం హిందువులదైతే చాలు దానిపై నానా రభస చేసి వాటిని శాశ్వతంగా కనుమరుగు చేయాలకున్న ఆలోచన కే మంచి గుణపాఠం తమిళుల తిరుగుబాటు..  మరికొన్ని ప్రాంతాల ప్రజలు కూడా వీరి బాటలో నడిచేందుకు  ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిచడం వారి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఆతృతగానే చూడాలి తప్ప వేరొకలా కాదు

No comments:

Post a Comment