Tuesday 3 January 2017

పరకాల స్వాతంత్ర్యపోరాటం

భారతదేశ స్వాతంత్రోద్యమకాలంలో 1919 ఏప్రిల్ 13న
పంజాబ్లోని జలియన్వాలాబాగ్లో కిరాతకుడు జనరల్ డయ్యర్
ఆదేశానుసారం ఉద్యమకారులపై జరిపిన కాల్పులు దారుణ ఉదంతం.

            అటువంటిదే మరొకటి... తెలంగాణలోని పరకాలలో నైజాం హయాంలో  జరిగిన సంఘటన. 1947 ఆగష్టు 15న దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ కు రాలేదు.స్వతంత్రఅనంతరం అన్ని సంస్థానాలు భారతయూనియన్లో విలీనంచేసినప్పటికీ నిజాం రాజ్యాన్ని భారత్లో విలీనం చేయకపోవడంతో, నిజాం నిరంకుశత్వం, రజాకార్ల పాశావికత, వెట్టిచాకిరిలో హీనంగాబతుకుతున్న ప్రజల్లో ఆగ్రహంకట్టలుతెంచుకుంది. పాతపరకాల తాలూక l    లోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కటంగురికేశవరెడ్డి ,నాగారంకు చెందిన వీరగోపాలరావు , కోటయ్య ,మరికొంతమంది ప్రముఖుల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయాలని   సంకల్పించి ఉదయాన్నే  గ్రామగ్రామలనుండి హాజరైన వేలాదిప్రజలతో ఊరేగింపుగా ెఅమరవీరుల మైదానానికి వె ళ్తున్న ప్రజలను ఒక్కసారిగా నిజాంసేనలు చుట్టుముట్టి ఖజానాను కొల్లగొట్టేందుకు వచ్చారనే నెపంతో 4000 మందిపై ఏ హెచ్చరికా లే కుండా ఒక్కసారిగా గర్జించాయి కర్కోటకుడైన ఖాసీంరజ్వీ సేనల తుపాకులు. ఫలి తం 13 మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు.  
           
          మాజీ ఎం పి విద్యాసాగర్ రావు ఈ సంఘటన ఎల్లప్పుడూ గుర్తు చేసేలా నిర్మించిన స్మృతి చిహ్నం ప్రతిఒక్కరిలో పోరాటపటిమను ప్రతీక్షణం పెంచుతుంది. అందుకే ఏ పోరాటాన్నైనా ఇక్కడి నుండే ప్రారంభించడాన్ని ఆనవాయితీ గా  మార్చుకున్నారు  పరకాల ప్రజలు

No comments:

Post a Comment