Tuesday 22 November 2016

మళయాలప్పుజ

అయ్యప్ప సన్నిధి నుండి తిరిగి పంప  చేరుకోవడానికి దాదాపు 3.00 గంటలు పట్టింది. దేవస్థానం వారి వాహనాలు నడిచే రోడ్డుపై కాకుండా మెట్లదారి గుండా దిగాలి, కానీ కొంతమంది రోడ్డు గుండా దిగాం, కానీ సురక్షితంగా లేదు. పంపవద్ద BSNL మాత్రమే పనిచేస్తోంది. అలసిపోయిన మాకు భోజనం ముగించుకొని బస్సు ఎక్కగానే వెంటనే నిద్రపట్టింది. దాదాపు 60 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత చిన్న హోటల్ spicey.com దగ్గర ఆగాం. ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా వెళ్తున్నామన్న మా మాటలు విన్న  మేనేజర్ మాతో మాట్లాడుతూ దగ్గరలోనే ఉన్న ఆలయం గురించి చెప్పడంతో మళయాలప్పుజ దేవి ఆలయానికి వెళ్లాం. భక్తుల తాకిడి కొంత తక్కువగా ఉంది. అయ్యప్ప దర్శించి వెళ్లేవారు చాలామంది ఇక్కడకు వస్తారట. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున స్టాల్ లో ఎర్రని విత్తనాలు  అమ్ముతున్నారు. ఈ  విత్తనాలతో దేవిని పూజిస్తే శత్రు బాధలు నివారింపబడతాయట. తర్వాత మా ప్రయాణం కేరళ రాజధాని తిరువనంతపురంకు.

No comments:

Post a Comment