Friday 4 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 6

ధర్మస్థల చేరేసరికి బాగా రాత్రి
అయ్యింది. ఇక్కడ పెద్దగా
ప్రయివేటు హోటల్ లు లేవు అన్ని
దేవస్థానం వారివే. మాకు ఇక్కడ వసతి
వెంటనే దొరికింది (గంగోత్రి కాటేజి)
మేం వెళ్ళిన మొత్తం టూర్ లో ఇక్కడే
తక్కువగా ధర రూములకి . ఆలయ
అద్భుతంగా కేరళ ఆలయాల
రీతిలో ఉంది. దాదాపు గా తిరుపతి లో
ఎలా నిర్వహణ ఉంటుందో అలాగే
ఉంది. ఇక్కడ ఆలయంలో గత 800 సంవత్సరాలుగా నిరాటంకంగా అన్నదానం సాగుతోందట.కర్ణాటక లోని దాదాపు అన్ని
ఆలయాలలో భక్తులకు అన్నదానం
నిర్వహిస్తున్నారు. ఆటోలోకల్ 10 రూ
తీసుకుంటారు. కానీ కాస్త దూరం
ఉండే రామాలయానికి 300
తీసుకున్నారు ముగ్గురికి.
వాస్తవానికి జీపు లాంటిది 400
కే వచ్చింది. రెండు చూడదగిన
మ్యూజియంలుకూడా
ధర్మస్థలలో ఉన్నాయి. పరుగెత్తించే
మన జీవితంలో ఆగి ఆస్వాదించాల్సినవి
ఎన్నో ఉన్నాయనిపించింది. మా
తరువాతి ప్రయాణం
ఇండియన్ హెరిటేజ్ సిటీ మైసూరు
కు.

No comments:

Post a Comment