Thursday 3 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 5

10 గంటల కల్లా ఉడిపి లో దర్శనం
పూర్తి చేసుకున్న మేము మరో
గంటలో శృంగేరికి బయలుదేరాం.
ఆగుంబే మీదుగా ఘాట్ రోడ్ డ్రైవింగ్
కష్టం అని అక్కడి వాల్లు చెప్పడం
తోకర్కాల మీదుగా 30 కిలోమీటర్ల
దూరం ఎక్కువైనా అలాగే వెల్లాం .
పూర్తిగా అడవి తో నిండిన ఘాట్
రోడ్ కావటం తో మేం శృంగేరి చేరేసరి
సాయంత్రం 3.00
అయింది. బస్సులోనుండి కాలు
కింద పెట్టగానే ఒక చిరుజల్లు
ముఖాన్ని తాకింది. గొడుగు
తీసుకుని శారదాపీఠానికి బయల్దేరాం.
ఆదిశంకరులు అద్వైతం
ప్రచారం చేయడానికి నెలకొల్పిన
నాలుగు మఠాలలో తుంగా తీరంలో ని
శృంగేరి శారద మఠం మెదటిది. గంగా
స్నానం తుంగా పానం రెండూ
అంతే గొప్పవని అక్కడివాల్లు
చెప్పారు. నీల్లు స్వచ్చంగా
ఉన్నాయి.ముందుగా శారదామాత
ఆలయం దర్శించుకున్నాం,
పురాతన ఆలయం అగ్నికి ఆహుతి
కావడంతో పునః నిర్మించారట. ఇక్కడ చాలా
మంది స్త్రీ లు అమ్మవారి కి ఒడి
బియ్యం, చీరెలను
సమర్పిస్తున్నారు.
తరువాత విద్యాశంకర ఆలయాన్ని 5.00
గంటల కు తెరచినాక దర్శించాం,
ఇదొక సైన్సు అద్భుతం.
సూర్యుడు రాశులు
మారినప్పుడల్లా కిరణాలు ఒక్కో
స్థంభం పైన మార్చి పడుతాయట.
ఆరోజు మఠంలో స్వామివారి దర్శనం
లేదనడంతోనది అవతలి వైపున ఉన్న
గురు నివాస్ కి వెళ్లకుండానే
ధర్మస్థలకు మా ప్రయాణం
ప్రారంభించాం. ఇక్కడ వసతి కోసం
టిటిడి వారి భవనం కూడా ఉంది.
ఇక్కడ పోలీసు వాల్లు పెట్టిన బోర్డు
చూడండి.

No comments:

Post a Comment