Thursday 3 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 3

గోకర్ణం నుండి మురుడేశ్వర్ 80
కిలోమీటర్లే ఐనా రోడ్ ఇప్పుడే నాలుగ
లేన్ల హైవే గా మారుస్తుండడం,
రద్దీ ఎక్కువ గా ఉండడంతో
దాదాపుగా 3 గంటల
సమయం పట్టింది.అరేబియా
తీరంలోని పంచ శైవ క్షేత్రాలో
మురుడేశ్వర్ ఒకటి.
ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోయిన
రావణుడు ఆత్మలింగాన్ని
తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం
వైపు నుంచి లాగడంతో అది
విసురుగా వెళ్ళి దూరంగా
పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర
లింగం వెలుస్తుంది. పెట్టె
మూతపడిన చోట గుణేశ్వర లింగం
ఉద్భవిస్తుంది.
లింగంపై కప్పబడిన వస్త్రం పడిన
చోట మురుడేశ్వర లింగం
వెలుస్తుంది. పెట్టెను కట్టిన
(తాళ్ళు) పడినచోట
ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది.ఈ
లింగాల మధ్య స్వామివారి
ఆత్మలింగం మహాబలేశ్వరలింగం
గోకర్ణంలో వెలుస్తుంది.
ఆత్మలింగంతో ముడిపడిన
ఐదుక్షేత్రాలను శైవ
పంచక్షేత్రాలని పిలుచుకుంటారు
కర్ణాటకలో. మురుడేశ్వర్ ఆలయ
గోపురం ప్రపంచం లోనే పెద్దదిగా
చెప్పవచ్చు. 18 అంతస్తులు.
సముద్రం మధ్యలో దీవిపై
మహాశివుని అతి పెద్ద విగ్రహం
ఇంకా అద్భుతం. ఇక్కడి నుండి
తర్వాతి ప్రయాణం ఉడిపి కి.

No comments:

Post a Comment